14, డిసెంబర్ 2016, బుధవారం

ధన్యత


గొప్పవాళ్ళను గురించి రాయడంలో వున్న గొప్పతనం ఈ ఉదయం బోధపడింది. సుప్రసిద్ధ జర్నలిష్టు వి.హనుమంతరావుగారి పై ‘సాక్షి’ దినపత్రికలో ఈరోజు నేను రాసిన వ్యాసంపై స్పందన గమనించిన తరువాత నాకీ సంగతి తెలిసింది. తెలుగు రాష్ట్రాలలోని మొత్తం ఇరవై మూడు జిల్లాలనుంచి అసంఖ్యాకంగా ఫోన్లు వస్తూనే వుండడం చూసి ఆశ్చర్యపోవడం నా వంతయింది. గొప్ప మనుషులనుగురించి రాయగలగడం కూడా ఒక రకంగా అదృష్టమే.
బెజవాడ నుంచి తుర్లపాటి కుటుంబరావు గారు ఫోను చేసి చెప్పారు. జర్నలిజంలో ఓనమాలు నేర్చుకున్నది నేను  ఆయన దగ్గరే.
“ఈ వ్యాసం చదివిన తరువాత నువ్వు నా శిష్యుడవని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను” అన్నారాయన.

సాక్షి రామచంద్ర మూర్తి గారికి కృతజ్ఞతలు.         

కామెంట్‌లు లేవు: