28, నవంబర్ 2016, సోమవారం

అర్ధం చేసుకోరూ......


ఏకాంబరం, లంబోదరం మాట్లాడుకుంటున్నారు. వీళ్లిద్దరిదీ రైలు పట్టాల సంభాషణ. సమాంతరంగా పోతుంటాయి కానీ ఎన్నటికీ కలవ్వు.
ఏకాంబరం: డాక్టరు రోగికి ఆపరేషన్ చేస్తున్నాడు. నొప్పి తెలియకుండా మత్తు మందు ఇచ్చాడు. రోగి స్పృహలోకి రావడానికి కొంత నిర్దిష్ట వ్యవధి వుంటుంది. అతడికి మెలకువ వచ్చేవరకు రోగి బంధువులు గాభరా పడుతుంటారు కానీ, విషయం తెలిసిన వైద్యుడు ఏమాత్రం కంగారు పడడు. అంతా అర్ధం చేసుకోవడంలో వుంది.

లంబోదరం: నిజమే. మత్తు మందు ఇచ్చి ఆపరేషన్ చేశాడు. డోసు సరిగా కుదరాలి. లేకపోతే, ఆపరేషన్ సక్సెస్ అయినా రోగి ఆమత్తునుంచి తేరుకోకుండానే కన్ను మూస్తాడు. అలా జరుగుతుందనే ఈ కంగారు. అర్ధం చేసుకోమనే నేను చెప్పేది.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

Ha Ha. Good post. Now demonetization dose became demonic.