18, మార్చి 2016, శుక్రవారం

తెలుగు గోస్వాములు


స్పీకర్ మైకు ఇవ్వడం లేదంటూ అసెంబ్లీలో గోల. టీవీ చర్చల్లో తమకు సరిగా అవకాశం ఇవ్వడం లేదంటూ పార్టీల ప్రతినిధుల మరో కొత్త గోల.
టీవీ  యాంఖర్లలో పలురకాలు, పలు ముఖాలు. వాళ్ళు  జర్నలిజం వృత్తికి  కొత్తయితే చర్చల్లో పాల్గొనేవాళ్ళు రెచ్చిపోతారు. వాళ్ళు  అనుభవం వున్న ఆసాములయితే ఆర్నబ్ గోస్వాముల మాదిరిగా వచ్చిన వాళ్ళతో ఆడుకుంటారు.


(Courtesy Cartoonist- Jai)



అతిధులకు  కూడా  విషయం అవగాహన అయినట్టుంది. అందుకే  ఈ మధ్య  యాంఖర్ ని పట్టించుకోకుండా,  అడిగినా, అడగకపోయినా  వాళ్ళే  కల్పించుకుని మాట్లాడేస్తున్నారు. దాంతో చేసేదేమీ లేక తెల్లమొహాలు వేసుకున్న  యాంఖర్లు,  ‘ఇప్పుడొక చిన్న విరామం’ ప్రకటనను  ఆశ్రయిస్తున్నారు.  

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

Arnab goswami the motor mouth. His self righteous holier than thou attitude is disgusting. The anchors should speak less and allow the participants to express their views. In the din of cross talk by four to five arm chair experts, it resembles a fish market. To hell with the presstitutes.