20, జులై 2015, సోమవారం

పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు

పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు అన్నారు మనసు కవి ఆత్రేయ.
నిజమే, పుష్కర స్నానం కోసం వచ్చి నిండు ప్రాణాలు బలి ఇచ్చి వెళ్లారు. పుష్కర పుణ్యం సంగతి యేమో కానీ వారి పుణ్యమా అని మొద్దు నిద్దర పోతున్న ప్రభుత్వాలు నిద్రలేచాయి. జనాలు రావడం గురించే తాపత్రయ పడి ప్రచారం చేసుకున్న నేతలు, ఏర్పాట్లు అంటే ఘాట్లు, లైట్లు అనుకుని 'క్రౌడ్ మేనేజ్ మెంటు' గాలికి ఒదిలేసిన అధికారులు, మొదటి రోజు దుర్ఘటనతో మేలుకుని తమ పని తీరు మార్చుకోబట్టే మిగిలిన పుష్కర దినాలు ప్రశాంతంగా సాగిపోతున్నాయి.
వాళ్లు చనిపోయి ఇతరులని బతికిస్తున్నారు. ఆ పోయినోళ్ళు మంచోళ్ళే కాదు ధన్య జీవులు, పుణ్య జీవులు.
వారికి మరోసారి హాట్స్ ఆఫ్.


కామెంట్‌లు లేవు: