2, జూన్ 2015, మంగళవారం

నోటుకు ఓటు - ఓటుకు నోటు



అనైతికం అని ఇరుపక్షాలు అంటున్నాయి. వున్న బలానికి మించి అభ్యర్ధులను పోటీకి దింపడం అనైతికం అని టీడీపీ అంటుంటే, ఇలా కోట్లు పోసి ఒక్క ఓటు కొనే ప్రయత్నం చేయడం నీతిబాహ్యమని టీ ఆర్ యస్ అంటోంది. అయితే ఇక్కడ ఒక విషయం  గుర్తుంచుకోవాలి. సాధారణంగా ఎవరయినా గెలుపు కోసం ఓట్లు కొనుగోలు చేస్తారు. కానీ ఇక్కడ సీను రివర్స్ అయింది. టీ ఆర్ యస్ ఐదో అభ్యర్ధి గెలవకుండా చూడ్డానికి బేరసారాలు జరిగాయి. ఈ కారణం చేతే ఈ సంఘటన జరగడానికి పూర్వం వరకు టీడీపీ  మీద వున్న సానుభూతి  ఆ తరువాత గాలికి కొట్టుకు పోయింది. టీడీపీ అంటున్నట్టు  ఇది రాజకీయ కుట్రే. కాదనము.  కాని ఆ కుట్రలో తనకు తానుగా  యెందుకు చిక్కుకు పోయిందని అడిగితె దానికి  టీడీపీ వద్ద సరయిన సమాధానం లేకుండా పోతోంది. అంచేతే అది నలుగురి దృష్టిలో  ముద్దాయిగా నిలబడాల్సివస్తోంది. ఎంతో రాజకీయ అనుభవం వున్న టీడీపీ అధినాయకత్వానికి ఇది స్వయంకృతమే. నవ నిర్మాణ దీక్షకు ముందు చేజేతులా అంటించుకున్న ఈ మురికిని ఒదుల్చుకోవాలి, అంతే కాని ప్రతిష్టకు పోయి మరింత అప్రతిష్ట మూటగట్టుకోకూడదు. 


NOTE: Courtesy Image owner   

1 కామెంట్‌:

Saahitya Abhimaani చెప్పారు...

లోకమెల్లా చొర శిఖామణుల సముదాయమా! దొరలందు దొరకని దొంగలెందరో,దొరికేన్ గాన దొంగ, విశ్వదాభిరామ వినుర వేమా