17, జూన్ 2014, మంగళవారం

టీవీ 10 న్యూస్ మార్నింగ్

ఈరోజు 17-06-2014, ఉదయం ఏడుగంటలకు టీవీ 10  ఛానల్, న్యూస్ మార్నింగ్ ప్రోగ్రాంలో నాతో  పాటు టీడీపీ ప్రతినిధి శ్రీమతి సీతారత్నకుమారి, ఫోన్ ఇన్ లో కులవివక్ష పోరాట సమితి ప్రతినిధి శ్రీ సాగర్, కృష్ణా జిల్లా ఎస్ ఎఫ్ ఐ నాయకుడు శ్రీ పాల్గొన్నారు. సమన్వయకర్తగా శ్రీ సతీష్ వ్యవహరించారు. ఫీజ్ రీఇంబర్స్ మెంట్, చుండూరు బాధితుల న్యాయపోరాటం చర్చకు వచ్చాయి. ప్రస్తావనకు వచ్చిన కొన్ని  ప్రశ్నలపై నా అభిప్రాయాలు క్లుప్తంగా:


"ప్రయోజనం పొందే  విద్యార్ధులకు వరంగా, అమలుచేసే ప్రభుత్వాలకు భారంగా పరిణమించిన పధకం ఇది. అయితే,  ఉన్నత విద్య అనేది ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు సాంఘికపరమైన గుర్తింపు ఇస్తుంది. ఈ పధకం కింద చదువుకున్నవారిలో  ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయన్నది ముఖ్యం కాదు. అలాటి పెద్ద  డిగ్రీ ఒకటి  చేతికి అందడం వల్ల, అన్నిరకాలుగా  వెనుకబడివున్న  యువతీయువకులకు  సామాజికంగా లభించే గౌరవ ప్రపత్తులు, తద్వారా ఒనగూడే ఆత్మవిశ్వాసం లెక్కలోకి తీసుకుంటే ఈ పధకం మీద ఖర్చు చేసేది వృధా అనిపించదు. భారం పెనుభారం అన్న తలంపు కలగదు. లొసుగులు వుంటే సవరించుకుని పధకాన్ని అమలు చేయాలి. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు భేషజాలకు పోకుండా పధకం అమలు జరిపి, విద్యార్ధుల భవిష్యత్తు అయోమయంలో పడకుండా చూడాలి. వారిపై పెట్టిన ఖర్చు ప్రభుత్వాల స్థాయిలో ఒకరికొకరు రీఇంబర్స్ చేసుకోవాలి. అంతే  కాని నిధుల కొరత పేరుతొ మొత్తం పధకానికి తూట్లు పొడవకూడదు. పిల్లలకు చెప్పించే చదువులకు అయ్యే ఖర్చు  భద్రమైన భవిష్యత్తుకు ఒక విధమైన  పెట్టుబడిగా పరిగణించాలి"

కామెంట్‌లు లేవు: