17, జనవరి 2014, శుక్రవారం

నో మోర్ 'గ్యాస్ ట్రబుల్'

ఎన్నికల ప్రచార రుతుపవనాలు ఢిల్లీని తాకాయి. మొదటి జల్లు పడింది.



వంట గ్యాస్ సిలిండర్ల సంఖ్యను తొమ్మిది నుంచి పన్నెండుకు పెంచాల్సిందని రాహుల్ గాంధీ ఏఐసీసీ సమావేశంలో ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసిన కొద్ది నిమిషాల్లోనే సంబంధిత మంత్రిగారి నుంచి తదనుగుణమైన క్యాబినెట్ నోట్ గింగిరాలు తిరుగుతూ వచ్చిందని స్క్రోలింగులు బుల్లి తెరలపై పరుగులు తీశాయి. (యువ)రాజు తలచుకుంటే సిలిండర్లకేమి కొరత? సెహభాష్.
మరి ఇది కుదరని పని అని నిన్నగాకమొన్న మంత్రిగారు చేసిన ప్రకటనలు ఏ గాలికి ఎగిరిపోయాయో!

(17-01-2014) 

కామెంట్‌లు లేవు: