26, ఆగస్టు 2013, సోమవారం

పెళ్ళంటే – పెళ్ళంటే బాజాలు, భజంత్రీలు

పెళ్ళంటే బంధు మిత్రుల సమాగమాలు, పాత పరిచయాల పునః సమీక్షలు (తిరగమోతలు) కూడా.  ఈరోజు ఆదివారం  షరా మామూలు పనులకు స్వస్తి చెప్పి పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు వీటితో బిజీ బిజీ.
ఉదయం మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో తమిళనాడు  గవర్నర్ రోశయ్య గారి మనుమరాలు ఐశ్వర్య  పెళ్లి. ఆ తరువాత కాసేపటికే కూకట్ పల్లి లో మాస్కో స్నేహితుడి  కుమారుడి పెళ్లి వుండడం చేతా, వీ ఐ పీల పెళ్ళిళ్ళలో రాకపోకలు (ట్రాఫిక్) కాస్త కష్టం అన్న ఎరుక, అనుభవం రెండూ  వుండడం చేతా,  కాస్త ముందుగా మాదాపూర్ వివాహానికి వెళ్లాను. అది కొంత కలసి వచ్చింది. రోశయ్యగారు ఒక ప్రత్యేక ఎంక్లోజర్ లో కూర్చుని అప్పుడే బ్రేక్ ఫాస్ట్ మొదలు పెట్టబోతున్నారు. నన్ను చూడగానే నాకు  కూడా ఉపాహారం తెమ్మని పురమాయించారు. శాసనమండలి చైర్మన్ చక్రపాణి గారు,  మాజీ మంత్రి సత్యనారాయణరాజు గారు అక్కడే వున్నారు. ఆ తరువాత రోశయ్యగారు పెళ్లి వేదికపైకి వెళ్ళగానే సీనియర్ జర్నలిస్టు మిత్రుడు శ్రీ వల్లీశ్వర్ తో కలసి అనేకమందిని కలుసుకునే అవకాశం కలిగింది.  ఈమధ్య కాలంలో వ్యక్తిగతంగా కలవడానికి వీలుపడని వారు ఎందరో అక్కడ కలిశారు. శ్రీయుతులు వెంకయ్యనాయుడు గారు,  డాక్టర్ దగ్గుబాటి వేంకటేశ్వర రావుగారు, (సత్యం) రామలింగరాజుగారు, హెచ్ జే దొరగారు, డాక్టర్ మల్లు రవి గారు  ఇలా అనేకమంది.
తదుపరి మాస్కో మిత్రుడు కమాండర్ దాసరి గారి పెద్దబ్బాయి పెళ్లి, సత్యనారాయణ వ్రతం కూకట్ పల్లిలో. జలవాయువిహార్ కమ్యూనిటీ హాల్ లో లంచ్. మాస్కోలో కలిసిమెలిసి తిరిగిన కుటుంబాలన్నీ అక్కడ కలిశాయి.
ఆ తరువాత నిజాంపేట్ లో ఓ గృహప్రవేశం. 1980లో చిక్కడపల్లిలో కలిసివున్న కేవీ రావు దంపతుల కూతురు స్మిత,  అల్లుడు వాసుదేవ శాస్త్రి ముచ్చటగా కట్టుకున్న ఇల్లు. పొందికగా వుంది. నాటి చతుర్ముఖ పారాయణం బ్యాచ్ కలిసింది. సంతోషమనిపించింది.
కింది ఫోటోలో: మాస్కో టీమ్ 


కుర్చీల్లో కూర్చున్న వాళ్లు : ఎడమనుంచి:  త్రిలోచన రమణ, రమా పరకాల, నిర్మల అంటే మా ఆవిడ, విశాల. నిలుచున్నవాళ్ళు : కేవీ రమణ, పరకాల సుధీర్, భండారు శ్రీనివాసరావు అనగా నేను, దాసరి రాము, శ్రీధర్ కుమార్

(25-08-2013)

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

mothaniki 3 putala papsnnam le....