2, ఏప్రిల్ 2013, మంగళవారం

వాళ్ళనే ‘గొప్పవాళ్ళు’ అని యెందుకు అంటామంటే?



మహాత్మా గాంధి జైల్లో వున్నప్పుడు కస్తూరి బా, ఆయన్ని  చూడడానికి వెళ్లారు.


భార్యాభర్తలకు మాట్లాడుకునే ఏకాంతం కల్పించాలనే  సదుద్దేశ్యంతో జైలు సార్జంటు వారిని  వొంటరిగా వొదిలేసి ఓ అరగంటసేపు బయటకు వెళ్లాడు. కస్తూరి బా వెళ్ళిన తరువాత ‘భార్య యోగక్షేమాలు అడిగారా, కుటుంబ సభ్యుల గురించి అడిగి తెలుసుకున్నారా ? వాళ్ళెలా వున్నారు?’ అంటూ  యధాలాపంగా గాంధీని అడిగాడు. ఆయన ఇచ్చిన సమాధానం ఆ బ్రిటిష్ అధికారిని నివ్వెర పరచింది.
‘జైల్లో వున్నప్పుడు ఇక్కడి నియమాలను పాటించి తీరాలి. జైలు సిబ్బంది పరోక్షంలో సొంతమనుషుల వద్ద కూడా నోరు విప్పకూడదని నాకు తెలుసు. అందుకే మీరు వెళ్ళి తిరిగివచ్చేదాకా మా ఆవిడతో నేను ఏవీ మాట్లాడకుండా మౌనం పాటించాను’
గాంధీ ఇంకా ఇలా అన్నారు.
‘మీరు బయటకు వెళ్ళకుండా వుండి వుంటే నేను నా భార్యతో ఏవయినా సంగతులు ముచ్చటించి వుండేవాడినేమో. మీరు లేకపోవడంతో నాకు ఆ అవకాశం లేకుండా పోయింది’
సార్జంటుకు నోటమాట రాలేదు. నెత్తి మీది టోపీ తీసి గాంధీకి వొంగి నమస్కారం చేసిన సంగతి కూడా వేరుగా  చెప్పేపనిలేదు. 
ఆయన అందుకే మహాత్ముడు అయ్యాడు.

(From some classic english narrations of Shri AS Murthy, Dy. Director, Ramakrishna Math during his speech  at TTD Tiru Nilayam Hyderabad, on 28.3.2013.)

కామెంట్‌లు లేవు: