28, జనవరి 2011, శుక్రవారం

ఎంత హాయి ఈ టీవీ ! - భండారు శ్రీనివాస రావు

ఎంత హాయి ఈ టీవీ ! - భండారు శ్రీనివాస రావు

శీతాకాలంలో చలి మంట మాదిరిగా, ఎండా కాలంలో పిల్లతెమ్మర మాదిరిగా ఈ రాత్రి ఓ టీవీ ప్రోగ్రాం చూసాను.

ఎంత బాగుందో అని ఎన్నిసార్లు అనుకున్నానో.

మంచి మనుషుల్ని కలుసుకోవడానికి ఎంత దూరం అయినా వెళ్ళాలి. మంచి మనసుల్ని తలచుకోవడానికి ఎంత గతంలోకి అయినా వెళ్ళాలి. అందుకే ఓ ఎనభయ్ ఏళ్ళు వెనక్కు పోదాం.

కలకత్తా మునిసిపల్ కార్పొరేషనుకు ఆయన మొట్టమొదటి మేయర్ గా ఎన్నికయ్యారు. తన వద్ద పనిచేసేందుకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఎంపిక చేసిన అధికారిని కాదని, నిండా పాతికేళ్ళు కూడా నిండని ఓ భారతీయుడిని కార్పొరేషన్ సీ. ఈ. వో. గా ఎంచుకున్నారు. మేయర్ నిర్ణయాన్ని అప్పటి ప్రభుత్వం సయితం వ్యతిరేకించలేదు.

సరికదా, ప్రజలచేత ఎన్నికయిన మేయర్ నిర్ణయాన్ని ఔదల దాల్చింది. ఈ నాటి స్వతంత్ర భారతంలో ఇలాటి ద్రుష్ట్యాంతం ఒక్కటి చూపగలమా. సందేహం అక్కరలేదు. ‘లేదు’ అని బల్ల గుద్ది చెప్పవచ్చు.

సరే, ఆ కుర్రాడు కొన్నాళ్ళు పని చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడనే రిపోర్టులు రావడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. అతడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కానీ మన మేయర్ జవసత్వాలు లేని రాజకీయ నాయకుడు కాదు. అందుకే, ఆ నాటి ప్రభుత్వంతో పోరాడి అతడిని విడిపించారు. ఆయన గొప్పతనం కొలిచేందుకు కొలమానాలు లేవు సరే. మరి అంతటి ఉదాత్త వైఖరి ప్రదర్శించిన బ్రిటిష్ ప్రభుత్వాన్ని పొగిడేందుకు వేయి నాలుకలు సరిపోతాయా. స్తానిక సంస్తలకు బ్రిటిష్ పాలకులు ఇచ్చిన ప్రాధాన్యత అలాటిదన్నమాట.

ఆ మేయర్ మహాశయుల పేరు ‘దేశబంధు’ చిత్తరంజన్ దాస్. ఆ కుర్ర అధికారి ఎవరో వూహించగలరా. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగించిన పోరాటానికి హింసా మార్గం అయినా తప్పులేదని భావించి అజాద్ హింద్ ఫౌజ్ స్తాపించిన అమరవీరుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్. (షుబాషు చంద్రబోషూ అని ఉచ్చరించాలని గూగుల్ సెర్చ్ ఉద్ఘాటిస్తోంది.)

ఇంతకీ చరిత్రలోని ఈ ఘట్టాన్ని గుర్తుచేసిన వారెవరో తెలుసా! ఆయన పేరు జయప్రకాష్ నారాయణ్. సోషలిస్ట్ నాయకుడు, జనతా పార్టీ ఆదిపురుషుడు, కీర్తిశేషులు జయప్రకాష్ నారాయణ్ కాదీయన. లోక సత్తా పార్టీ పెట్టి ‘మార్పు’ కోసం కలలుకంటున్న మాజీ ఐ. ఏ. ఎస్. ఆఫీసర్ . ఇక సందర్భం అంటారా . జనవరి ఇరవైఎనిమిదో తేదీ రాత్రి, హెచ్ ఎం టీ వీ ప్రసారం చేసిన ‘కమాన్ ఇండియా’ ప్రోగ్రాంలో పాల్గొంటూ స్వయంగా జయప్రకాష్ నారాయణ్ నుడివిన చారిత్రిక సత్యాలు ఇవి. ఈ ప్రోగ్రాం ప్రెజెంట్ చేసిన ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, దానికి సహకరించిన హెచ్ ఎం టీ వీ బృందం, టెలివిజన్ ఛానల్ కార్యక్రమాలకే కొత్త రూపం, కొత్త సొగసు ఇచ్చారని చెప్పాలి. మిగిలిన ఛానళ్ళు కూడా కనీసం అప్పుడప్పుడయినా ఈ విధమయిన కార్యక్రమాలను చూపించడానికి ఇది ఉత్ప్రేరకం కాగలిగితే అంతకన్నా సంతోషించాల్సిన విషయం ఈనాటి టీవీ వీక్షకులకు మరోటి వుండదు. ఇదే జరిగితే, ఈ మధ్యకాలంలో టీవీ ఛానళ్ల తీరును ఎండగడుతూ వస్తున్నవిమర్శలలోని వాడినీ, వేడినీ కొంతవరకయినా తగ్గించడానికి వీలుపడుతుంది. (28-01-2011)

27, జనవరి 2011, గురువారం

డబ్బెవరికి చేదు? - భండారు శ్రీనివాసరావు

డబ్బెవరికి చేదు? - భండారు శ్రీనివాసరావు


దేశవ్యాప్తంగా ఇప్పడు ఒక ఆసక్తికరమయిన చర్చ జరుగుతోంది. అదీ నల్ల ధనాన్ని గురించి. కొందరివద్దే వుండే ఈ నల్ల డబ్బును గురించి ఇప్పుడు ప్రతివాళ్ళు మాట్లాడుతున్నారు. కారణం వికీ లీక్స్ అనే సంస్త బయటపెట్టిన వివరాలు.

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరవాత ఈ అరవై మూడేళ్ళ పైచిలుకు కాలంలో పోగుపడ్డ అవినీతి సొమ్ము అక్షరాలా కోటి కోట్ల రూపాయల పైమాటే అని ఒక అంచనా.ఈ డబ్బుతో మనదేశానికి వున్న యావత్తు రుణభారాన్ని అసలు వడ్డీలతో సహా రెండుసార్లు చెల్లు వేయవచ్చనీ ఒక వాదన వినిపిస్తోంది. సిగరట్ తాగే అలవాటు వున్నవాళ్ళు రోజుకొక్క సిగరెట్ తాగడం మానగలిగితే, ఆ ఒక్క సిగరెట్ కయ్యే ఖర్చును లెక్కలోకి తీసుకుంటే, వారి జీవితకాలంలో ఆదా అయ్యే డబ్బుతో ఏకంగా ఒక ఇల్లే కొనుక్కోవచ్చని అంటుంటారు. ఆ రీతిలోనే ఈ నల్లడబ్బుతో ఏమేమి చేయవచ్చో చెవికి ఇంపైన కధనాలు వెలువడుతున్నాయి. కోటి కోట్లు అంటే ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెట్టాలో చప్పున చెప్పడం కష్టం. కానీ ఆ నల్ల డబ్బును తెల్లగా మార్చగలిగితే దానితో ఏమేమి చేయవచ్చో కొంతమంది ఒక జాబితా తయారుచేసారు. అది ఇలా వుంది.

ప్రతి గ్రామానికి మూడేసి చొప్పున సకల సౌకర్యాలతో కూడిన ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయవచ్చు. అవినీతి మకిలి అంటిన సొమ్ముతో ఆరోగ్యం ఎందుకని ‘డౌటేహాలు’ వ్యక్తం అయితే, ఆ డబ్బుతో దేశ జనాభాలో అరవై కోట్లమందికి ఎంచక్కా తలా ఒక నానో కారు కానుకగా ఇవ్వవచ్చు. కారిస్తే సరిపోతుందా పెట్రోలు డబ్బులు ఎవరిస్తారు? అని ‘శంక’ర రావులు ప్రశ్నిస్తే - దేశంలో ప్రతి ఒక్కరికీ పిల్లా పెద్దా తేడాలేకుండా అక్షరాలా తలా యాభయి ఎనిమిది వేల విచ్చు రూపాయలు పంచిపెట్టి పండగ చేసుకోమనవచ్చు. లేకపోతే, రైతుల రుణాలన్నీకట్టగట్టి ఒక్క దెబ్బతో బాజాప్తాగా మాఫీ చేయవచ్చు. ప్రజలపై పన్నులు వేయకుండా కొన్నేళ్లపాటు ప్రభుత్వాలు జనరంజక పాలన సాగించవచ్చు.

ముందే చెప్పినట్టు ఇవన్నీ వినడానికి ఇంపుగా వుండే విషయాలు. అయితే, అడ్డమయిన అడ్డదార్లన్నీ అడ్డదిడ్డంగా తొక్కి ఇబ్బడిముబ్బడిగా సంపాదించిన డబ్బును ఎవరయినా అబ్బురంగా అవసరమయితే స్విస్ బాంకుల్లోనో, మరో మరో విదేశీ బాంకుల్లోనో భద్రంగా దాచుకుంటారు కానీ ఇలా దాన కర్ణుల మాదిరిగా, బలి చక్రవర్తుల మాదిరిగా, ఆ డబ్బుకు నీళ్ళు వొదులుకుంటారా! అంటే నమ్మడం ఒక పట్టాన కష్టమే.

దాచేవాడు వుంటేనే దోచుకునే వాడుంటాడని ఓ సామెత. ఎంత గజ దొంగ అయినా, తాను దొంగిలించిన సొత్తును దాచిపెట్టేవాడు లేకపోతె ధైర్యంగా దొంగతనానికి దిగడు. అలాగే, దేశసంపదను రకరకాల కుంభకోణాల ద్వారా, టక్కుటమార విద్యల ద్వారా దోచుకునే ‘స్కాముల స్వాములు’ అక్రమ మార్గాల్లో సంపాదించిన అవినీతి డబ్బును దాచిపెట్టడం కోసం స్విస్ బాంకుల లాటివి ఆవిర్భవించాయి. పేరయితే స్విట్జర్లాండుకు వచ్చిందికానీ ఈ మాదిరి బాంకులు ప్రపంచ వ్యాప్తంగా డెబ్బయి దాకా వున్నాయి. ‘టాక్స్ హెవెన్స్’ అని ముద్దుగా పిలుచుకునే ఈ బాంకులు అమెరికా, ఇంగ్లాండ్ దేశాలకు చుట్టుపక్కలవున్న దీవుల్లో పాగావేశాయి.

‘మా దగ్గర దాచుకునే డబ్బుకు పన్ను బాధ లేదు. పట్టుకుంటారనే భయం లేదు. మీ డబ్బుకు పూర్తిగా మాదే పూచీ’ అంటూ నల్ల కుబేరులకు ఇవి గాలం వేస్తున్నాయి. పనికొచ్చే డబ్బును, ఎందుకూ పనికి రాకుండా గోనె సంచుల్లో మూటలుకట్టి మూలన పడేయడం ఎందుకనుకునే కొందరు బడాబాబులకు ఈ బాంకులు వరప్రసాదాలుగా మారాయి.

ఈ బాంకుల్లో దాచుకునే డబ్బుకు ఎలాటి వడ్డీ ఇవ్వరు. అయినా కోట్ల కోట్ల డబ్బును ఆ బాంకుల్లోనే దాచుకుంటారు. ఎందుకటా! వడ్డీ ఇవ్వకపోయినా డబ్బుకు మాత్రం భద్రత వుంటుంది. అసలుకు మోసం వుండదు. అంతేకాదు డబ్బు దాచుకున్న వ్యక్తి పేరును ఎట్టి పరిస్థితుల్లోను, ఎవరు అడిగినా బయటపెట్టరు అన్న హామీ కూడా వుంటుంది. ఇలా తమ వద్ద దాచుకునే డబ్బు నిజాయితీతో సంపాదించింది కాదని తెలిసినా, ఇచ్చిన మాటకు కట్టుబడే నిజాయితీ ఈ బాంకులకు వుంది. మొక్కవోని ఈ నిజాయితీ ఒక్కటే- ప్రపంచ వ్యాప్తంగా వున్న ‘నల్ల డబ్బు దొరలను’ ఆ బాంకుల వైపు పరుగులు పెట్టిస్తూ వుంటుంది. అభివృద్ధి చెందిన దేశాలవారే కాదు, అభివృద్ధి చెందుతున్న దేశాలవారే కాదు, రష్యా, చైనా వంటి కమ్యూనిస్ట్ దేశాల వారు కూడా ఈ బాంకుల్లో డబ్బు దాచుకుంటున్నారంటే ‘నల్ల డబ్బు’ ఎంత విశ్వ వ్యాప్తం అయిందో, దాని విశ్వరూపం ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.

సాధారణ పౌరులు విదేశాలకు వెళ్ళేటప్పుడు తమ వెంట తీసుకువెళ్ళే డబ్బు విషయంలో నానా ప్రశ్నలు వేసి విసిగించే అధికారులు – ఇంతంత డబ్బు విదేశాలకు తరలి వెడుతుంటే ఎలా అనుమతిస్తున్నారన్న సందేహం కలగడం సహజం. అయితే, ఇలాటి అనుమానాలన్నీ నల్ల డబ్బు లేనివాళ్ళకే కాని వున్న దొరలకు రావు. ఎందుకంటే, డబ్బు సంపాదించే అడ్డ దారులు తెలిసినవారికి ఇలాటి ‘రహదారులు’ కూడా తెలిసే వుంటాయి.

మొత్తం మీద వికీ లీక్స్ పుణ్యమా అని దేశవ్యాప్తంగా మీడియాలో సాగిన చర్చోపచర్చల ఫలితంగా అయితేనేమి, సుప్రీం కోర్టు పెట్టిన ‘చివాట్ల’ వల్లనయితేనేమి, ఈ నల్లధనం వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ప్రధాని మన్మోహన్ సింగ్ పూనికపై కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తనకు తానుగా విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి కొన్ని చర్యలు తీసుకోబోతున్నట్టు వెల్లడించారు. నల్ల డబ్బు పెరుగుదలను అరికట్టేందుకు అయిదంచెల వ్యూహాన్ని ప్రకటించారు. ఈ డబ్బు ఎంతవుంది అన్న అంచనాలు ప్రభుత్వం వద్ద లేవని చెప్పారు. ఇందుకోసం అధ్యయన బృందం ఏర్పాటుచేయడానికి సంసిద్దత వ్యక్తం చేసారు. విదేశీ బాంకుల్లో డబ్బు దాచుకుంటున్న వారి వివరాలు అంతర్జాతీయ వొప్పందాల కారణంగా వెల్లడి చేయడం సాధ్యం కాదని ప్రధాని లోగడ పాడిన పాత పల్లవినే ఆర్ధిక మంత్రి మరో మారు వల్లె వేసారు. పన్ను ఎగవేతదారుల వివరాలు తెలుసుకుందుకు అరవై అయిదు దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. నల్లధనం దాచుకున్నవారు స్వచ్చందంగా ఆ డబ్బును తిరిగి మన దేశానికి తీసుకురావడాన్ని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ‘ఆమ్నెస్టీ’ పధకాన్ని ప్రవేశపెట్టే విషయం కూడా ప్రభుత్వ పరిశీలనలో వుందన్నారు. కానీ ఇలా అక్రమార్కులకు క్షమాభిక్ష ప్రసాదించే ఇటువంటి పధకాలవల్ల నిజాయితీగా పన్నులు చెల్లించేవారినుంచి విమర్శలు ఎదురయ్యే అవకాశం వుందని ప్రణబ్ అన్నారు.

ఆర్ధిక మంత్రి వెల్లడించిన అంశాలను బట్టి చూస్తే ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే ఏదో ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటుందనే ఆశలు సన్నగిల్లాయి. విదేశీబాంకుల్లో మూలుగుతున్న నల్ల డబ్బును తెల్ల డబ్బుగా మార్చే విధాన రూపకల్పన పట్ల ఇంకా ఆచి తూచి వ్యవహరించాలన్నదే ప్రభుత్వ పోకడగా అనిపిస్తోంది. సచ్చీలుడు, నిజాయితీపరుడు అన్న పేరున్న మన్మోహన్ సింగే స్వయంగా నల్లడబ్బు ఆసాముల గుట్టు రట్టు చేయడం కుదరదన్నారంటే – అందులోని లోగుట్టు కనుక్కోవడం కొంత కష్టమే. కానీ, మన దేశంలోనే గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్న నల్లడబ్బును బయటకు తీయడానికి అంతర్జాతీయ ఒప్పందాలు అడ్డు రావుకదా. మరి దీనికి అడ్డం పడుతున్నదెవరు?

పరిపాలనా యంత్రాంగంలో అతి చిన్న హోదా కలిగిన ఉద్యోగి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేసినప్పుడు బయటపడే డబ్బు లెక్కపెట్టడానికి ‘కౌంటింగ్ యంత్రాలు’ అవసరమవుతున్నాయంటే, దేశంలో దొంగ డబ్బు ఎంత దర్జాగా దొరతనం చెలాయిస్తున్నదో అర్ధం చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ దండాల్లో చేతులుమారుతున్న డబ్బును గురించి వార్తలు వింటుంటే నల్లడబ్బు చేస్తున్న స్వైర విహారాన్ని అవగాహన చేసుకోవచ్చు. ఉయ్యాలలో పాపను పెట్టుకుని ఊరంతా వెతుక్కున్నట్టు, నల్లడబ్బుకోసం విదేశీ బాంకుల దాకా పోనవసరం లేదని ఈ వివరాలే విశదం చేస్తున్నాయి.

ఓ నలభై యాభయ్ ఏళ్ళక్రితం ఎలిమెంటరీ స్కూళ్ళల్లో వారానికి ఓ మారయినా ‘మోరల్’ క్లాసు పేరుతొ నీతి పాఠాలు బోధించేవాళ్ళు. చిన్నప్పటి నుంచే ఏది తప్పో ఏది ఒప్పో చెప్పేవాళ్ళు. స్కూలుకు వెళ్ళే వీలులేనివాళ్లకి ఇలాటి మంచి మాటలు కధలుగా చెప్పి సరయిన దారిన పెట్టే పెద్దవాళ్ళు ఇళ్ళల్లో వుండేవాళ్ళు. తప్పును తప్పని చెప్పేవాళ్ళు లేక, ఆ తప్పులే తాము చేస్తూ పిల్లలకు అవి తప్పని చెప్పే తలిదండ్రులు లేక, దాదాపు ఒకతరం ఈ స్వతంత్ర భారతంలో పెరిగి పెద్దదయింది. ఎంత సంపాదించావు అన్నది ప్రధానం కానీ ఎలా అన్నది ముఖ్యం కాదనే మరో తరం మన కళ్ళెదుటే పెరిగి పెద్దదవుతోంది. ఈనాడు ప్రధానంగా ఆలోచించుకోవాల్సింది మానసికంగా మురికిపట్టిపోయిన ఈ నల్ల తరాన్ని గురించి.

విదేశీ బాంకుల్లో మనవాళ్ళు దాచుకున్న నల్ల డబ్బును స్వదేశానికి తీసుకురావదానికి ఏ ప్రయత్నం జరిగినా అది హర్షించదగిందే. ఆహ్వానించదగిందే. కానీ, అంతకు ముందు, నైతికంగా దిగాజారిపోయిన జాతి జనులకు నీతులు నేర్పాలి. తడబడుతున్న వారి నడవడికను సరిదిద్దాలి. కానీ, ఇది కాదు శాశ్విత పరిష్కారం. ఇవన్నీ ఎవరో నేర్పితే అలవడేవి కావు. ఎవరికి వారే నేర్చుకోవాలి. అలాకాని పక్షంలో, విదేశీ బాంకుల్లోకి అక్రమంగా తరలివెళ్లిన డబ్బును పట్టి బలవంతాన దేశంలోకి లాక్కు వచ్చినా, అది నల్ల ధనాన్ని మరింత పెంచుతుందే కానీ అందరూ అనుకుంటున్నంత మేలు ఆ ప్రయత్నం వల్ల వొనగూరదు. (26-01-2011)











.

26, జనవరి 2011, బుధవారం

Is Kashmir integral part of India ?-Bhandaru Srinivasrao

Is Kashmir integral part of India ?-Bhandaru Srinivasrao

The on-going 'war of nerves' between the BJP and the Congress over hoisting Indian tri-color flag at Lal Chowk in Kashmir, in fact, brings the question "Can Kashmir rightfully considered an integral part of India ?"

That too, when the Chinese staple visa issue is alive and kicking! Its maps apparently show separating Kashmir . Recent reports suggest that part of J&K had been shown as part of China in their maps. Well, the dispute over J&K between India and Pakistan are well known. The Kashmir conflict is a now territorial dispute over the Kashmir region, the northwestern most region of South Asia.

India claims the entire state of Jammu and Kashmir and as of 2011, administers approximately 43% of the region, including most of Jammu , the Kashmir valley, Ladakh, and the Siachen Glacier. India 's claim is contested by Pakistan , which controls approximately 37% of Kashmir , namely Azad kashmir and the northern areas of Gilgit and Baltistan.. China controls 20% of Kashmir, including Aksai Chin, which it occupied following the1962 brief war, and the Trans-Karkoram Tract (also known as the Shaksam Valley), which was ceded by Pakistan in 1963.

India has officially stated that it believes that Kashmir is an integral part of India . Pakistan says that Kashmir is a disputed territory whose final status must be determined by the people of Kashmir . China states that Aksai Chin is a part of Tibet , which is a part of China . Certain Kashmiri independence groups believe that Kashmir should be independent of both India and Pakistan.

India and Pakistan have fought at least three wars over Kashmir , including the Indo-Pakistan wars of 1947, 1965 and 1999. India and Pakistan have also been involved in several skirmishes over the Siachen Glacier. Indian government's heavy expenditure on its army to protect this disputed territories also quite often come under sharp criticism in some quarters. The recent criticism has come from none other than social activist and writer Arundhati Roy against whom huge and cry was raised. The demand for her prosecution over her statement that Kashmir historically cannot be an integral part of India also reached flash point not so long ago.

Even before the Chinese staple-visa and Arudhathi's alleged anti-national statement could die down, the rightist Bharateeya Janata Party kicked up a row on 62 anniversary celebrations of country's Republic Day. The BJP voed to hoist the tri-color national flag at Lal Bagh, which was foiled by the National Conference headed Omar Abdullah government. The Omar government claims that the BJP move to hoist Indian flag at Lal Bagh may create law and order problem. But, the BJP claims as Jammu and Kashmir is an integral part of India , why have such fears. It accuses the Omar's government for bowing down to separatists and terrorists pressures. No day passed in the valley without a terrorist attack either on civilians or security establishments. Some local parties, wedded to the demand for separate entity, also making parties in power life miserable.

The pertinent question here is that while India fighting over the dispute with neighboring Pakistan on one hand and the China on the other, over its territorial claim on Jammu and Kashmir , now shirks its responsibility in supporting the BJP move to hoist the tri-color flag at Lal Bagh. Well, the move to hoist tri-color flag at Lal Bagh in Kashmir by the BJP may be part of its strategy to derive some political mileage, yet its failure to deny the right to hoist national flag on its 'soils' is what makes many wonder how far our claim over Jammu and Kashmir is 'genuine' and 'true', if not 'real.' But, BJP has to reply some questions like 'how come the same BJP when it was heading a coalition government at the center, failed to hoist a tri colour flag at Lal Chowk? This is also a debatable point. (26-01-2011)

25, జనవరి 2011, మంగళవారం

ఫోన్ మారినా నెంబర్ అదే! – భండారు శ్రీనివాసరావు


ఫోన్  మారినా నెంబర్ అదే! – భండారు శ్రీనివాసరావు

సెల్ ఫోన్ వినియోగదారుల్లో చాలామంది ఫోన్ కనెక్షన్ తీసుకునే సందర్భం లో ధర విషయం మినహా మిగిలిన అంశాలు సాధారణంగా పట్టించుకోరు. ఆతరవాత కానీ, క్రమంగా సర్వీసుకు సంబంధించిన సమస్యలు అనుభవం లోకి రావు. అలాగే, ఎంపిక చేసుకున్న మొబైల్ ఆపరేటర్ తో ఎదురయ్యే ఇబ్బందులు కూడా అర్ధం కావు. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు వున్నట్టుండి లైన్ కట్ కావడం, అవతలనుంచి మాట సరిగా వినపడక పోవడం, ఎప్పుడు ఫోన్ చేసినా అవతల వారి ఫోన్ దొరక్కపోవడం, దొరికినా ‘ప్రస్తుతం స్పందించుట లేదు’ అనే షరా మామూలు సమాధానం రావడం – ఇవన్నీ మొబైల్ వినియోగదారులు అనునిత్యం ఎదుర్కునే సమస్యలే. ఒక్కసారి ఓ కంపెనీ ఫోన్ తీసుకున్నాక వినియోగదారుడు ఎదుర్కునే సమస్యల గురించి పట్టిచుకునే నాధుడు వుండడు. కష్టమర్ సర్వీసులు పేరుకు మాత్రమె కాని వాటివల్ల వినియోగదారులకు కొత్త తల నొప్పులే కానీ సమస్యలు త్వరరగా త్వరత్వరగా పరిష్కారం అవుతున్న దాఖలాలు లేవు. అందువల్ల, చాలామంది, ఫోన్ కానీ, ప్రొవైడర్ ను కానీ మార్చుకోవడానికి ఆలోచన చేసినా వారికి ప్రధాన అడ్డంకి వాళ్ళు ప్రస్తుతం వాడుతున్న ఫోన్ నెంబర్. ఈ నెంబర్ ను తరచూ మార్చుకోవడానికి ఎక్కువమంది ఇష్టపడరు. తమకూ, తమకు తెలిసిన వారికీ బాగా అలవాటయిన నెంబర్ ను చూస్తూ చూస్తూ వొదిలిపెట్టలేరు. అల్లా అని ఫోన్ ప్రొవైడర్లతో ఎదురయ్యే సమస్యలను గాలికి వొదిలెయ్యలేరు.

ఈ విషయాలనన్నీ బాగా అధ్యనం చేసిన పిమ్మట, భారత ప్రభుత్వం వినియోగదారులకు ఊరట కలిగించే ఒక ప్రధాన విధాన నిర్ణయం తీసుకుంది.

వినియోగదారులకు తమ మొబైల్ కంపెనీ ఆపరేటర్ అందించే స్కీములు, సర్వీసులు, నచ్చకపోతే ఈ జన్మకు ఇంతే అని సరిపెట్టుకోవాల్సిన అవసరం ఇక లేదు. పాత నెంబర్ ను అట్టి పెట్టు కుంటూనే, మరో పక్క ఇష్టం లేని ఆ ఆపరేటర్ ని ఇట్టే మార్చేసుకుని తమకు నచ్చిన మరో ఆపరేటర్ ని ఎంపిక చేసుకొని ఆ కంపెనీకి మారిపోవచ్చు. ఈ సౌకర్యం మన దేశంలో ఈ జనవరి ఇరవై నుంచి అందుబాటులోకి వచ్చింది. మొదట్లో ఈ సదుపాయాన్ని హర్యానాలో నిరుడు నవంబర్ లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. అది వినియోగదారులను ఆకట్టుకోవడం తో ఇప్పుడు దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నారు.

మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎం ఎన్ పీ) అని సాంకేతిక నామం కలిగిన ఈ సదుపాయం వల్ల సామాన్య వినియోగదారుడుకి ఏమిటి ప్రయోజనం అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము.

మొబైల్ కమ్యూనికేషన్ టెక్నాలజీ లో ఈ ఎం ఎన్ పీ అనేది కొత్తగా అందుబాటులోకి వచ్చిన నూతన ప్రక్రియ.

మన దేశంలో ఈనాడు మొబైల్ ఫోన్ లు వాడేవారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం మన దేశంలో డెబ్బయి కోట్లమంది సెల్ ఫోన్ లు ఉపయోగిస్తున్నారు. ఇంత పెద్ద మార్కెట్ వుండడం వల్ల అనేక మొబైల్ కంపెనీలు ఈ రంగం లో అడుగుపెట్టి అనేక రకాల స్కీములతో కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా పలు రాయితీలతో ఎప్పటికప్పుడు కొత్త పధకాలకు రూపకల్పన చేస్తున్నాయి. మొబైల్ ఆపరేటర్ల నడుమ సాగుతున్న ఈ తీవ్రమయిన పోటీ కొంతవరకు వినియోగదారుడుకి కలసివచ్చే అంశం అయినప్పటికీ, మరో కంపెనీకి మారాలనుకున్నప్పుడు, అలవాటయిన నెంబర్ ను మార్చుకోవాల్సి రావడం వల్ల, ఇష్టం వున్నాలేకపోయినా ముందు ఎంపిక చేసుకున్న కంపెనీ సర్వీసులను వొదిలిపెట్టలేని పరిస్తితి అతడిది. కనెక్టివిటీ బాగా లేకపోయినా, ఇతర కంపెనీలు మరింత ఆకర్షణీయమయిన పధకాలు ప్రవేశ పెట్టినా, వాటికి మారిపోవడానికి తటపటాయించాల్సివస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన నూతన విధానం తో ఈ ఇబ్బంది తొలగిపోయింది. పాత నెంబర్ ను కొనసాగిస్తూనే కొత్త కంపెనీకి మారిపోయే అవకాశం వినియోగదారుడుకి లభించింది. పోస్ట్ పెయిడ్, ప్రీ పెయిడ్ వినియోగదారులందరికీ ఈ సదుపాయం వర్తిస్తుంది.

ఎలా మారవచ్చు?

ఈ సర్వీసుని ఉపయోగించుకుని ఆపరేటర్ ను మార్చుకోవాలనుకునే వారు ముందుగా తన మొబైల్ నుంచి 1900 కు ఒక ఎస్ ఎం ఎస్ పంపుకోవాల్సి వుంటుంది. ఎస్ ఎం ఎస్ పంపగానే, ప్రస్తుతం అతడు ఉపయోగిస్తున్న మొబైల్ ఆపరేటర్ నుంచి ఒక ప్రత్యేకమయిన ‘పోర్టింగ్ కోడ్’ అందుతుంది. అప్పుడు ఒక నిర్దిష్టమయిన దరఖాస్తు పత్రం పూర్తిచేసి, ‘పోర్టింగ్ కోడ్’ తో సహా తను మారాలనుకుంటున్న ఆపరేటర్ ను పేర్కొంటూ ఆ పత్రాన్ని తాను ప్రస్తుతం వాడుతున్న ఆపరేటర్ కు పంపాలి. ఆ తరువాత కొత్త సర్వీసు ప్రొ వైడర్ – ప్రస్తుత ప్రొ వైడర్ నుంచి కస్టమర్ కు సంబంధించిన వివరాలను సేకరిస్తారు. వారం రోజుల్లో కొత్త మొబైల్ ఆపరేటర్ నెట్ వర్క్ కు ఈ నెంబర్ ను అనుసంధానం చేయడం జరుగుతుంది. ఇందుకోసం వినియోగ దారుడు కేవలం పందొమ్మిది రూపాయలు మాత్రమె కొత్త ఆపరేటర్ కు చెల్లించాల్సివుంటుంది. కాకపొతే, జమ్మూ కాశ్మీర్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాలలో ఇందుకు పట్టె వ్యవధి పదిహేను రోజులు.
అయితే ఈ నెంబర్ మార్పిడికి కొన్ని పరిమితులు వున్నాయి. వినియోగదారుడు నివసించే ప్రాంతంలోని ఆపరేటింగ్ ఏరియాకి మాత్రమే ఈ మార్పిడిని అనుమతిస్తారు. ఉదాహరణకు హైదరాబాదులో ఉపయోగిస్తున్న నెంబర్ ని బెంగళూరుకో, ముంబై కో మార్చుకోవాలంటే కుదరదు.

ఈ కొత్త విధానం వల్ల వినియోగదారుడుకి మంచి వెసులుబాటు లభించినప్పటికీ, సర్వీసు ప్రొవైడర్లకు మాత్రం కొంత ఇబ్బందే. నెంబర్ తో ఇబ్బంది లేదు కాబట్టి కష్టమర్లు మంచి సర్వీసు ఇచ్చే కంపెనీలకు మారిపోయే అవకాశం వుంటుంది. అలాగే కనెక్టివిటీ బాగావుండే ప్రొవైడర్లపట్ల ఆసక్తి చూపే వీలుంది. కష్టమర్లను ఆకర్షించే క్రమంలో తమ లాభాల మార్జిన్లను తగ్గించుకుని అయినా కొన్ని కంపెనీలు చార్జీలు తగ్గించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.

కష్టమర్లు అటూ ఇటూ మారడం, వారిని ఆకట్టుకునే ఎత్తుగడలు పెరగడం, మొబైల్ ఫోన్ ఒక్కింటికీ సగటు ఆదాయాలు తగ్గిపోవడం – ఇవన్నీ కంపెనీలకు ఇబ్బంది కలిగించే అంశాలే అని నిపుణులు అంటున్నారు.

పోతే, సర్వీసు నాణ్యతను పెంచుకోవడం ద్వారా మాత్రమే కంపెనీలకు కొత్త కష్టమర్లు లభించే అవకాశం వున్నందువల్ల ఈ అంశంపై అవి దృష్టి సారించక తప్పదు. అలాగే త్రీ జీ వంటి అత్యాధునిక అంశాలను జోడించడం ద్వారా కూడా కష్టమర్ల సంఖ్యను పెంచుకోవచ్చు.

అయితే, మొబైల్ వినియోగదారులకు నిపుణులు మరో సలహా కూడా ఇస్తున్నారు. ఏదో వీలు దొరికింది కదా అని వేరే ఆపరేటర్ కు మారిపోవడం వల్ల పెద్దగా కలిసొచ్చేది కూడా వుండకపోవచ్చు. రాయితీలు ఎక్కువ అనే వుద్దేశ్యం తో కాకుండా నెట్ వర్క్ మొదలయిన ఇతర అంశాలకు సయితం ప్రాధాన్యం ఇవ్వడం మంచిదని వారి సలహా. (25-01-2011)

21, జనవరి 2011, శుక్రవారం

అంతా భ్రాంతియేనా! – భండారు శ్రీనివాసరావు

అంతా భ్రాంతియేనా! – భండారు శ్రీనివాసరావు


చిత్రం స్తిరంగా వుంటుంది. అయినా కదులుతున్నట్టుగా అనిపిస్తుంది. అంతా భ్రాంతి.

ఇటీవల హస్తినలో రాజకీయపరిణామాలన్నీ ఈ కోవ కిందికే వస్తాయి.

ఎదో జరగబోతున్నట్టు వూహాగానాలు. ఏదో జరిగిపోతున్నట్టు సరి కొత్త సమాచారాలు. చివరికి జరిగిందేమిటి? సున్నకు సున్న హళ్లికి హళ్లి.

దేశంలో ఇంకా ఏమీ సమస్యలు లేనట్టు, కేంద్ర మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్తీకరణ గురించి మీడియాలో స్క్రోలింగులు బారులు తీరాయి. వూహాగానాలు గుప్పుమన్నాయి. ఆశావహులు, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ ఎంపీలు, ఆంధ్ర, తెలంగాణా అనే తేడా లేకుండా కొద్ది రోజులపాటు ఆశల పల్లకీ దిగకుండా వూరేగారు. మీడియాలో పేర్లు వచ్చిన వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసినట్టే సంతోషించారు. రాని వాళ్ళు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసారు. అధిష్టానం మనసులో ఏముందో అంజనం వేయకుండానే చెప్పగలం అని తరచుగా ధీమా వ్యక్తం చేస్తుండే ధీరులు కూడా, విషయం చివరికి ఇలా ముగుస్తుందనీ, విస్తరణలో ఆంధ్రప్రదేశ్ కు ఈసారి విస్తరి వేసి వడ్డన చేయడం లేదనీ ఏ మాత్రం పసికట్టలేకపోయారు. పైగా వారూ కలలుకన్న జాబితాలో చేరిపోయారు.

అయినా, ఎన్నికలకు ఇంకా మూడేళ్ళు వ్యవధానం వుంది. మంత్రులు కావడానికి ఇదే చివరాఖరు అవకాశం కాని మాట కూడా నిజమే. రాజకీయాల్లో ఈ లెక్కలు కుదరవు. ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’ అనే భయమే రాజకీయుల్ని వెంటాడుతుంటుంది. ‘దూరాన మేఘం చూసి దోసిట్లో నీళ్ళు పారబోసుకునే’ తత్వం వారి రక్తంలో వుండదు. ‘ఎప్పటికెయ్యది ప్రస్తుతమ’నే థియరీ వారిది. అందుకే మీడియాలో వస్తున్న తమ పేర్లు చూసి ఓ పక్క మురిసిపోతూనే, మరో పక్క లాబీ ప్రయత్నాలను బహుముఖంగా ముమ్మరం చేసారు.

అనుకున్న విధంగానే కొన్ని మార్పులతో, చిన్ని చేర్పులతో కేంద్ర మంత్రివర్గం పునర్వ్యస్తీకరణ జరిగింది. కానీ రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలకు మాత్రం అనుకున్నదొక్కటీ, అయినది ఒక్కటీ అన్న చందంగా మొండి చెయ్యే మిగిలింది. ఆశల పల్లకీ అదృశ్యం అయింది. ఇప్పటికింతే అన్న వాస్తవం అర్ధం అయింది. అంతవరకూ వెలిగిపోయిన ముఖాలన్నీ ఆరిపోయిన మతాబుల్లా మారిపోయాయి. అధిష్టానం ఇలా ఎందుకు చేసింది అన్న దానిపై సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన దుస్తితి. ఇది మరింత దుర్భరం. అయినా చేయగలిగింది ఏమీలేదు. అధిష్టానమా! మజాకా! పైగా అదెంత శక్తివంతమయినదో జగన్ రెడ్డి ఉదంతం అప్పుడు ముందు వరసలో వుండి బాజా భజాయించి చెప్పిన వాళ్ళు వీళ్ళేనాయే. తేలుకుట్టిన దొంగల విధంగా వుంది వారి వ్యవహారం.

ఈ నేపధ్యంలో శ్రీ కృష్ణ కమిటీ నివేదికపై మాట్లాడుకుందాం రమ్మని అధిష్టానం నుంచి పిలుపు. నిజంగా ఇది పుండుపై కారం చల్లడమే. ‘రామనీ, రాలేమనీ’ ముందు సన్నాయి నొక్కులు నొక్కినా మొత్తం మీద అంతా కట్ట కట్టుకుని ( పేపరు వార్తల ప్రకారం ఎనిమిది మంది మినహా) అధిష్టానం ముందు హాజరు వేయించుకున్నారు.

‘చెప్పాల్సింది ఏమన్నా వుంటే చెప్పుకోవచ్చన్నా’రు అధిష్టాన దేవతలు. తాము మాత్రం పెదవి కదపకుండా, ప్రతి ఒక్కరు తమ వాదాన్ని తెలియచేసుకోవచ్చని ఉదారంగా అవకాశం ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపీలు విడివిడిగా ఏమి చెప్పారో తెలియదుకానీ, బయటకు వచ్చి కలివిడిగా ఒకే మాట చెప్పారు. శ్రీ కృష్ణ కమిటీ చేసిన ఆరో సిఫారసు తమకు ఆమోదయోగ్యం అని పార్టీ పెద్దలకు తామంతా ముక్త కంఠంతో నొక్కిచెప్పామని తెలియచేసారు. తాము చెప్పినదంతా పార్టీ పెద్దలు సావధానంగా విన్నారనీ, తెలంగాణా ఎంపీ లతోబాటు మరోమారు మా అభిప్రాయాలను కూడా విని ఆ తరవాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారని వెల్లడించారు. అంటే ఆచి తూచి వ్యవహరించడమనే ‘నాన్చుడు’ ప్రక్రియ మరోసారి మొదలయిందనుకోవాలి.

ఇదంతా బయటకు కనబడే వ్యవహారం. సమావేశానికి హాజరయిన ఎంపీల్లో కొందరు ధైర్యం చేసి మంత్రివర్గ విస్తరణ సమయంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెట్టినట్టు భోగట్టా.

మంత్రివర్గ విస్తరణ విషయంలో తమని చిన్న చూపు చూసారన్న బాధ వారిని ఈ విషయంలో జంకూ కొంకూ లేకుండా మాట్లాడేటట్టు చేసివుంటుంది. వీరిలో చాలామంది చాలా సీనియర్లు. పాతిక ముప్పయ్యేళ్లనుంచీ పార్టీ ఎంపీ లుగానే కాలం వెళ్ళబుచ్చుతున్నారు. మంత్రి పదవి అనే మెట్టెక్కడానికి తమకు ఈ టరం దాదాపు ఆఖరిదన్న భయం కూడా వారిలో చాలామందిలో వున్నట్టు తోస్తోంది. దశాబ్దాల తరబడి పార్టీని నమ్ముకుని వున్నందుకు తగిన ప్రతిఫలం లేకపోగా కనీస గుర్తింపు కూడా లభించడం లేదన్న ఆవేదన వారి మనస్సుల్లో గూడుకట్టుకుని వుంది. ‘ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ముల వాడి’ వారి మనసులను కలవర పెడుతోంది. దీనికి తోడు తమ సామాజిక స్తితిగతులు కూడా తమ రాజకీయ ఎదుగుదలకు కాంగ్రెస్ లో అడ్డు వసున్నాయన్న అభిప్రాయం వారిలో వున్నట్టు వుంది. రాయపాటి సాంబశివరావు ఈ విషయాన్ని ఎలాటి భేషజం లేకుండా కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసారు కూడా. తెలుగుదేశం హయాంలో తాము ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడడం కోసం ఎంతో కష్ట పడ్డామనీ, ఆర్ధికంగా కూడా నష్ట పోయామనీ, అయినా పార్టీ అధిష్టానం మాత్రం ఏ చిన్న అవకాశం దొరికినా మరో సామాజిక వర్గం వారికే పెద్ద పీట వేస్తోందనీ, ఇది తమనూ, తమను నమ్ముకున్న కార్యకర్తలను బాగా కలత పెడుతోందనీ తమ మనసులో మాట బయట పెట్టారు.


ఇక తెలంగాణా కాంగ్రెస్ ఎంపీల వ్యవహారం ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ప్రత్యేక తెలంగాణా అంశం తమ రాజకీయ భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నా – కార్యకర్తల మనోభావాలకు విరుద్ధంగా  తాము అధిష్టానం మాటను గౌరవించి నడుచుకుంటూ వస్తున్నా – పదవుల పందేరం దగ్గరకొచ్చేసరికి తమను ఆవల పెట్టడం ఏమిటన్న భావన, బాధ వారిలో వెల్లువెత్తుతోంది. వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదని కుమలడమే వారికి మిగిలింది.

అన్నింటికంటే ముఖ్యమయిన విషయం వెనుకబడ్డ తరగతులకు చెందిన ఎంపీలకు పదవుల ఆశ పెట్టి వారిని మరింత వెనక్కు నెట్టడం. వారి పేర్లు టీవీ తెరలపై వరుసగా వస్తున్నప్పుడు కూడా ఢిల్లీ పెద్దలు పెదవి విప్పకుండా చోద్యం చూడడం, ఈ సారి కొన్ని అనివార్య కారణాలవల్ల ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారిని మంత్రివర్గంలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేయకపోవడం. ఇవన్నీ చూస్తుంటే, కేంద్రంలో యూ పీ ఏ ప్రభుత్వం ఏర్పడడానికి దన్నుగా 33 మంది లోకసభ సభ్యులను (వై ఎస్ జగన్మోహన రెడ్డి రాజీనామా తరవాత ఇప్పుడు 32) ఢిల్లీ కి పంపిన ఆంధ్ర ప్రదేశ్ కు హస్తినలో మిగిలిన గౌరవం ఏపాటిదో తెలిసిపోతోందని వెలువడే విమర్శలకు కాంగ్రెస్ చెప్పుకునే సమాధానం ఏమిటి?

ఆంధ్ర ప్రాంతంలో జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణాలో ప్రత్యేక రాష్ట్ర వివాదం - కేంద్ర మంత్రివర్గ విస్తరణలో రాష్ట్ర ప్రయోజనాలకు అడ్డం వచ్చి వుండవచ్చు. కొందరికి ఇచ్చి మరి కొందరిని కాదనడం వల్ల మరిన్ని సమస్యలను నెత్తికెత్తుకున్నట్టు కాగలదని ఆలోచన చేసి వుండవచ్చు. కాదనలేము. కానీ, విస్తరణలో ఆంధ్ర ప్రదేశ్ కు లభించబోయే ప్రాతినిధ్యం గురించి మీడియాలో ప్రచారం జోరున సాగుతున్నప్పుడు దాన్ని అడ్డుకోవడానికి అధిష్టానం ఎందుకు చొరవ చూపలేదన్నది, కారణాలు ఎందుకు చెప్పలేదన్నదీ కూడా ఆలోచించాల్సిన వ్యవహారమే. ‘పేర్లు బయటకు వచ్చి, చర్చలు జరిగి, పీర్లు గుండాన పడ్డప్పుడు చూసుకుందాంలే’ అన్నది అధిష్టానం ఆలోచన అయితే మాత్రం దాన్ని మించిన తప్పుడు విధానం మరోటి వుండదు. సొంత పార్టీ వారితోనే ఆటలు ఆడుకోవడం ద్వారా వారిని తమ చెప్పుచేతల్లో వుంచుకోవాలనుకుంటే అది ఎప్పుడో ఒకప్పుడు తమ చేయి కూడా దాటిపోయే ప్రమాదం వుంటుందని పార్టీ పెద్దలు గుర్తుంచుకోవాలి. బీహారు మొదలయిన రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఎదుర్కున్న విషమ పరిస్తితి నేపధ్యంలో, మరి కొన్ని రాష్ట్రాలలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలను కళ్ళ ముందు పెట్టుకుని కూడా పార్టీ అధిష్టానం రాష్ట్ర నాయకుల పట్ల అనుసరిస్తున్న వైఖరి ఆ పార్టీకి ఎంతమాత్రం మేలు చేసేదిగా వుండదని ఆ పార్టీని అభిమానించే వాళ్ళే బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఇంకా ఎన్నికలకు మూడేళ్ళు వుందన్న ధీమాతో అధిష్టానం ఇలా ఒకటికి పది సార్లు తప్పులు తొక్కుకుంటూ వెడుతుంటే ముందు ముందు వాటిని సరిదిద్దుకునే వ్యవధానం కూడా దానికి వుండకపోవచ్చు. కారణం- కాంగ్రెస్ వారే తరచుగా ఇతర పార్టీలకు చేస్తుండే హెచ్చరిక “ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు” (21-01-2011)

16, జనవరి 2011, ఆదివారం

దేవుడిదే భారం - భండారు శ్రీనివాసరావు

దేవుడిదే భారం - భండారు శ్రీనివాసరావు


ఏమి జరుగుతున్నదో తెలియదు. ఏదో జరగబోతున్నదని తెలుసు.

చుట్టూ చిమ్మ చీకటి. చుట్టూతా కీకారణ్యం.

మండల దీక్ష ముగించి, దైవదర్శనం చేసుకుని, మకర జ్యోతిని కళ్ళారా తిలకించి, ఆ తృప్తిని గుండెల్లో పదిలం చేసుకుని ఇంటి ముఖం పట్టిన వారందరికీ –

ఏమి జరుగుతున్నదో తెలియదు. ఏదో జరగబోతున్నదని మాత్రం తెలుసు.

లిప్త మాత్రంలో జరగరానిది జరిగిపోయింది. కాల యముడు పాశం విసిరాడు. వందకు పైగా ప్రాణాలు గాలిలో కలిసాయి.

ఎక్కడివాళ్లో వాళ్ళు. ఎక్కడెక్కడి వాళ్లో వాళ్ళు. దేవుడి పేరుతొ అక్కడ కలిసారు. ఆ దేవుడిలోనే కలిసిపోయారు.

ఈ మరణాలకు ఎవరు కారణం? ఈ దారుణానికి ఎవరిది బాధ్యత?

ఈ ఏడాది శబరిమల సందర్శించిన అయ్యప్పలు అరవై లక్షలమంది అని అంచనా. ఏటేటా ఈ సంఖ్య పెరుగుతూనే వస్తోంది.

అసలే క్లిష్టమయిన దీక్ష. అతి క్లిష్టమయిన యాత్ర. అయినా భక్తులకు ఇవేమీ అడ్డుకాదు. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు పాతిక ముప్పయ్యేళ్లనుంచి ప్రతియేటా ఈ దీక్షాధారణ చేస్తున్నవారు వేల సంఖ్యలో వుంటూ వస్తున్నారు. స్వామియే శరణమంటూ వివిధ రాష్ట్రాలనుంచి ఏటా శబరిమలకు ప్రయాణం కడుతున్నారు. దుర్గామారణ్యం నడుమ సాగే ఈ యాత్రలో ఎన్నో అవరోధాలు, వూహించని ప్రమాదాలు సహజం. రోడ్డు ప్రమాద ఘటనల్లో అయ్యప్పల మృతి గురించిన వార్తలు ప్రతి ఏటా వింటూనే వున్నాం. కానీ ఈసారి జరిగిన దుర్ఘటన కనీ వినీ ఎరుగనిది. యాత్ర ముగించుకుని కొండవాలు మీదుగా సన్నటి కాలిబాటలో నడుచుకుంటూ వెడుతున్న భక్తుల బృందంపై వెనుకనుంచి ఒక వాహనం దూసుకురావడం, దానితో భీతావహులయిన యాత్రీకులు చెల్లాచెదరుగా పరుగులు తీయడం, ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో అనేకమంది ఊపిరాడక కనుమూయడం అంతా కనుమూసి తెరిచేలోగా జరిగిపోయింది. అంతవరకూ అయ్యప్ప నామస్మరణలతో మార్మోగిన లోయ యావత్తూ ఆ నిశీధిలో ఆందోళనకు గురయిన భక్తులు చేసే హాహాకారాలతో దద్దరిల్లిపోయింది. ఈ ఘోర దుర్ఘటనలో వందమందికి పైగా చనిపోయినట్టు ప్రాధమిక సమాచారం. తొక్కిసలాటలో లోయలోకి కొందరు పడిపోయివుంటారని వేస్తున్న అంచనాలు నిజమయిన పక్షంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం వుంది. ఇక క్షతగాత్రుల సంఖ్య రెండువందలకు మించే వీలుందని అధికారులు చెబుతున్నారు. చనిపోయిన వారిలో దాదాపు ఇరవై మంది మన రాష్ట్రానికి చెందినవారే వున్నారు.

దుర్ఘటన సమాచారం అందగానే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రం సయితం స్పందించింది. జాతీయ విపత్తుగా పరిగణించింది. సైనిక దళాలను సహాయ కార్యక్రమాలకు నియోగించింది. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ఆర్ధిక సాయం ప్రకటించింది.

ఇవన్నీ కంటి తుడుపు చర్యలని కొట్టి పారేయడం సబబు కాదు. అలాగని ప్రభుత్వాలు చేయగలిగినదంతా చేసాయని కూడా చెప్పలేము. జరిగినదానికి స్పందించిన మాట నిజమే. కానీ ఇలాటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఆలోచన చేసివుంటే మరింత బాగుండేది.

శబరిమలకు ఏటా ఒక నిర్ణీత సమయంలోనే యాత్రీకుల రద్దీ వుంటుంది. అందువల్ల మిగిలిన దేవాలయాల విషయంలో కంటే ఇక్కడ ముందు జాగ్రత్త చర్యలు పకడ్బందీగా తీసుకోవడానికి ఎక్కువ వీలుంటుంది. క్రమబద్ధమయిన ప్రణాళికా రచనకు, దాని అమలుకు అధికారులకు మరింత వెసులుబాటు వుంటుంది.

పర్యావరణానికి చేటు కలగకుండా కొండ వాలుల్లో కాలిబాటలను ప్రమాద రహితంగా తీర్చిదిద్దడానికి తగిన వ్యవధానం, అంటే మిగిలిన దేవస్తానాలతో పోలిస్తే ఏటిపొడుగునా భక్తుల రద్దీ లేని ప్రత్యేక పరిస్తితి ఈ క్షేత్రానికి వుంది. ఆదాయానికి కొదువ లేని దేవస్తానం కాబట్టి చేపట్టే పధకాలకు నిధుల కొరత వుండే అవకాశం లేదు. కావాల్సినదల్లా కాస్త చిత్తశుద్ధి. సాయపడాలనే మంచి బుద్ధి.

దీనికి చిన్న ఉదాహరణ నా అనుభవంలోనే వుంది. ఎనభయ్యవ దశకం చివర్లో నేను మాస్కోలో వున్నప్పుడు గమనించేవాడిని. పెద్ద పెద్ద ఆటలపోటీలు జరిగినప్పుడు, భారీ ఎత్తున జనాలు తరలివచ్చే వీలున్న కార్యక్రమాలు నిర్వహించినప్పుడు, మిలీషియా (పోలీసులు) చక్కటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేవాళ్ళు. స్టేడియంలనుంచి దాపునవున్న మెట్రో రైల్వే స్టేషన్ల వరకు కొన్ని వందలమంది పోలీసులు తాళ్ళు పట్టుకుని వచ్చిపోయేవారికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా, తోపులాటలకు అవకాశం లేకుండా, కొన్ని వేలమంది ప్రేక్షకుల రాకపోకలను క్రమబద్ధం చేసే తీరు ప్రసంశనీయంగా వుండేది.

మనదగ్గరో. జనసందోహాలను అదుపు చేయడం అంటే లాఠీలు ఝలిపించడమే. (16-01-2011)

వినదగునెవ్వరు చెప్పిన -భండారు శ్రీనివాసరావు

వినదగునెవ్వరు చెప్పిన -భండారు శ్రీనివాసరావు


ఇద్దరు వ్యక్తుల నడుమ అనుమాన బీజం నాటుకోవడానికి ఒక్క క్షణం చాలు. కానీ వారిద్దరు కలసి గడిపిన రోజుల్లోని అనేక మధుర క్షణాలను ఆ ఒక్క క్షణమే తక్షణం మరచిపోయేలా చేస్తుంది.


మిమ్మల్ని పట్టించుకోని ఎవరినీ బాధ పెట్టడం సరికాదు. అలాగే, మీతో ఎంతమాత్రం సంబంధం లేనివాడు మిమ్మల్ని బాధ పెడుతుంటే వూరుకోవడం కూడా సమంజసం కాదు.


జీవితం అనేది పిల్లీ ఎలుకా నడుమ సాగే పరుగు పందెం లాటిది. ఈ పోరులో తరచుగా చిట్టెలుకదే పై చేయి కావడం కార్టూన్ సినిమాల్లో చూస్తుంటాము. పిల్లి అస్తమానం ఆహారం కోసం వెంపర్లాడుతుంటే – ఎలుక ప్రాణాలు దక్కించుకోవడం ఎలా అని చూస్తుంది. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే – అవసరం కన్నా పరమార్ధం ముఖ్యం అని.


మనకు నచ్చని అనేక అవలక్షణాలు ఇతరుల్లో వుంటే వుండవచ్చుగాక. వాటిని గురించి ఏమాత్రం పట్టించుకోవద్దు. క్షమించి వొదిలేయడం ఉత్తమం. కానీ అవే లక్షణాలు మీలో వుంటే మాత్రం వాటిని మన్నించి వూరుకోవడం ఎంతమాత్రం క్షేమం కాదు.


చుట్టూ తెలివితక్కువ వాళ్ళను పెట్టుకొని తెలివిగలవాళ్ళం అనిపించుకోవడం గొప్పకాదు. పైగా అలాటి వారితోనే అస్తమానం కాలం గడుపుతుంటే కొన్నాళ్ళకు వున్న తెలివి కూడా తెల్లారిపోయే ప్రమాదం వుంది. గొప్పవాళ్ళ సాంగత్యంలో వుంటే కొద్దో గొప్పో ఆ గొప్పదనం మనకూ లభించే అవకాశం వుంటుంది.


భావోద్రేకాలు అనేవి దేముడు మనిషికి ప్రసాదించిన విలువయిన వరాలు. వాటిని జాగ్రత్తగా వాడుకోలేకపోతే ఆ అమూల్య వరాలే భయంకర శాపాలుగా మారిపోతాయి.


విశ్వాసం అన్నింటినీ సుసాధ్యం చేస్తుంది. ఆశ అన్నిటినీ సక్రమంగా పనిచేసేలా చూస్తుంది. ప్రేమ యావత్ ప్రపంచాన్ని అందంగా కళ్ళ ఎదుట ఆవిష్కరిస్తుంది. ఈ మూడూ తోడుంటే – జీవితంలో ప్రతిరోజూ అద్భుతంగా గడిచిపోతుంది.


రెండు చేతుల్లో రాళ్ళు పట్టుకుని వుంటే మీ గుప్పిళ్ళలో మిగిలేవి ఆ రాళ్ళే. ఎందుకంటె ఎంతో విలువయిన వజ్రాలు అందుబాటులోకి వచ్చినా అందుకోవడానికి మీ చేతులు ఖాళీగా వుండవు.


జరిగినదానిని తలచుకుని చింతించడం అంటే కుమిలే గుండెని మరింత బాధపెట్టడమే. జీవితంపట్ల నమ్మకాన్నిపోగొట్టుకోవడమే.

అందుకే, నిన్న జరిగిన వాటినుంచి మనసును మళ్ళించుకోవాలి. రేపటి గురించిన భయాలను వొదుల్చుకోవాలి. ఈ రోజు నుంచి ప్రశాంతతను స్వీకరించాలి.


చిన్న తాళం చెవితో పెద్ద తాళాన్ని తెరవగలుగుతున్నట్టే - చిరునవ్వుతో ఇతరుల హృదయాలలో సుస్తిర స్తానాన్ని సంపాదించుకోవచ్చు.


గురి మీద గురిపెట్టి వుంచాలి. సూర్యకిరణానికి ఎంతటి తేజస్సు వున్నా- ఒక్క బిందువు మీద ఆ శక్తిని కేంద్రీకరించని పక్షంలో మామూలు కాగితాన్ని సయితం అది కాల్చలేదు.


ఇతరులతో పోల్చుకోవడం, లేని పోని దానిని ఆశించడం – అనే రెండింటిని వొదులుకోగలిగితే, జీవితంలో గెలుపు సొంతం అవుతుంది.


సీతాకోకచిలుక జీవించేది కేవలం పదునాలుగు రోజులే. అయితేనేమి? ఆ స్వల్ప వ్యవధిలోనే అది ప్రతిరోజునీ ఆస్వాదిస్తుంది. హాయిగా అందంగా ఆనందంగా ఎగురుతుంది. అందరి హృదయాలను చూరగొంటుంది. మనిషి జీవితంలో కూడా ప్రతి క్షణం అమూల్యమైనదే. దాన్ని ఆమూలాగ్రం ఆనందించగలగాలి. ఇతరులను ఆనందింపచేయాలి.


జీవితంలో అత్యంత ఉత్తమ క్షణాలను సొంతం చేసుకోవడానికి ఏదయినా సరే వొదులుకోండి. కానీ దేనికోసమో మీ జీవితంలోని ఉత్తమ క్షణాలను మాత్రం వొదులుకోకండి.


అపజయాలకు కొన్ని కారణాలు వుంటాయి. మామిడి చెట్టు కింద నిల్చుని యాపిల్ పండు కోరుకుంటే ఎలా? కోరికనన్నా మార్చుకోవాలి. లేదా సరయిన చెట్టు కింద అయినా నిలబడాలి.


అన్ని విషయాలను గురించి సరయిన అవగాహన వున్నవాళ్ళే తమకు తెలిసింది చాలా తక్కువ అని వొప్పుకుంటారు.


ఆర్ధిక శాస్త్రాన్ని ఆపోసన పట్టిన పిల్లవాడే తండ్రి వ్యాపారాన్ని తొందరగా దివాళా తీయించగలుగుతాడు.


మూర్కుడు చిట్టచివర చేస్తే తెలివయినవాడు మొట్టమొదటే చేస్తాడు. (16-01-2011)

14, జనవరి 2011, శుక్రవారం

Has Jagan accomplish his objective? - Bhandaru Srinivas Rao

Has Jagan accomplish his objective? - Bhandaru Srinivas Rao

With the success of his “Jala Deeksha” near Jantar Mandar in Delhi, the former Congress MP from Kadapa, Y S Jaganmohan Reddy, appears to have achieved his objective – i.e., to send strong message to UPA Chairperson and Congress President Sonia Gandhi that their party is in peril in Andhra Pradesh..

His ultimatum to Congress-led UPA government is now ‘loud and clear’. He made it clear that he holds the `button` and at any moment the one-month-old N Kiran Kumar Reddy government may fall. “Kiran`s government in Andhra is surviving at my mercy,” he thundered and with an equal effect he reiterated that his intention was not pull down the government as it was installed for the second successive time for his late father Dr Y S Rajasekhara Reddy.

But, the Congress panicked with Jagan`s `thunder` and immediately took up the `damage control` by holding out veil threats to initiate action against those who openly identified in the Jagan`s camp. As many as 24 MLAs attended the Delhi`s “Jala Deeksha” and the Congress though wanted to take disciplinary action, but scared of consequences that to follow. More than its Chief Minister and the PCC Chief, the party high command seems to rely more on the feed back given by the state Governor ESL Narasimhan, a former cop, who had been sent to Andhra Pradesh in difficult situation to `manage things.`

But those who attended the Jagan`s “Jala Deeksha” dare to challenge the party high command to take action against them. They are confident that the party high command will dare not take any action fearing fall of Kiran government and subsequently losing the state to Opposition. They also compare their act with that the Telangana MPs and MLAs, besides Ministers, who defy the party high command`s direction to restrain on T-issue, but taking active part in anti-government activities. “Same yard stick should be applied to both of us (those who attended the Jagan`s meeting and the MPs and MLAs of the T-region.,” is their contention.

Thus far, the party high command has been pushed to the wall. But it wanted its Governor to come to their rescue. As per their mentor`s directive, the Governor summoned the Chief Minister N Kiran Kumar Reddy as well the Praja Rajyam Party leader, Mr Chiranjeevi, to chalk out future course of action. The Governor apparently weighing pros and cons over possible fall out in case the party initiate disciplinary action against those erring 24 MLAs. The Governor and party high command are confident to make up that loss by roping in 14 of the 16 PRP MLAs, besides half a dozen MIM members. But, their worry is now, if the pro-Jagan MLAs number swells, then the party may be in deep trouble.

That`s the reason why the Governor apparently sought more time before initiating action against the erring MLAs to ascertain the actual number of MLAs who are willing to rock the Congress boat. If the number does not exceed 30, then the party high command may as well apply the Karntaka-type formula – i.e., disqualifying the 24 who defied the party directions by openly expressing their solidarity to former Kadapa MP, Y S Jaganmohan Reddy. Thus, the ‘disqualification fear` may thwart others from any such misadventure in future and ensure the proposed Congress-minority government with the support of PRP and MIM to be in power for few more months. But, can such a decision be taken in the absence of a full-fledged speaker to the state assembly ? This is in the wake of genuine doubt expressed by former ap assembly speaker and senior TDP leader Yanamala Ramakrishnudu. According to him, the deputy speaker has no such powers.

Congress high command is apparently convinced with the fact that even the main Opposition Telugu Desam is also not so keen in destabilizing Kiran government. The party high command is also equally confident, that too after Pranab Mukherjee`s meeting with party MPs from Telangana, the demand for state bifurcation, can be `neutralized` with `power baits`. Some of the MPs appears jubilant of getting berths in the Central Cabinet, while others some key important posts in the party hierarchy.

With a shrewd and experienced cop in Raj Bhavan, the party high command is confident of crushing the Telangana agitations with iron hand. That`s what apparently transpired in Pranab`s meeting with Telangana MPs was evident from the `cold feet` developed by some of more vocal leaders like Ponnam Prabhakars-tye. At a morning TV debate the firebrand MP from Karimangar made it clear that their `resignations en masse` no way help achieving Telangana. He had also not ruled out some of his Telangana colleagues joining the Central Cabinet. He justifies no wrong in accepting ministerial berths as per the party high command wishes.

Thus far, the party high command seems to have realized that the bifurcation demand can be handled with much ease, but its immediate worry is the `growing support` to Jagan from within the party. Hence, it chose to `focus` its attention more on ensuring the `survival` of Kiran government rather than TRS demand for separate statehood, which may turn more complicated, if it dare to take any initiative. It indeed was quick to realize its mistake through December 9 statement by the Union Home Minister P Chidambaram.

In fact, the TRS which is firm on its demand, yet again gets disappointment with the Congress MPs attitude as well that party led UPA government at the Centre. They too appears in a `fix` as they relied most on Sonia and her party by time and again stating that Congress alone can help realize their dream. But, for time being, their dream appears shatters with no other option but to carry on their struggle single handedly.

TRS and its leadership are well aware of any unleashing of terror from their side only push state to use `force` resulting in `unrest` leading ultimately towards President`s Rule in the state.

As far as Jagan is concerned, his objective is 2014, but if situation thrust upon him, he is too glad to grab it. He is confident of his strengths and weakness in coastal and Rayalaseema, besides Telangana. He is more keen to buy more time for Congress government`s fall in the state, expecting possible political realignments. Political analysts are of the firm opinion that if mid-term elections thrust on Andhra, Jagan`s new party can easily walk away with 80-100 seats in coastal and Rayalaseema regions, leaving Telangana to their ‘fate.’

In that backdrop, I may accept to certain extent with my colleague analysts that Jagan chalking out his political strategies to `perfection` and accomplish his ultimate objective, sooner than later(14-01-2011)

8, జనవరి 2011, శనివారం

అయిదా? ఆరా? తేల్చాల్సింది ఎవరు? – భండారు శ్రీనివాసరావు

అయిదా? ఆరా? తేల్చాల్సింది ఎవరు? – భండారు శ్రీనివాసరావు


మాయాబజార్ సినిమాలో శ్రీ కృష్ణుడు బలరామాదులకు ప్రియదర్శిని పేటికను ప్రదర్శిస్తాడు. ఆ పెట్టె తెరచి చూసినవారికి వారి మనసులో ఏమి కోరుకుంటున్నారో అదే అందులో కనిపిస్తుంది. ఇప్పుడు శ్రీ కృష్ణ కమిటీ కూడా సరిగ్గా అదే చేసింది. వివాదంతో సంబంధం వున్న వారందరికీ తాము కోరుకున్నవిధంగానే కమిటీ సిఫారసులు వున్నాయనే భ్రాంతి కలిగేలా వేర్వేరు సూచనలకు రూపకల్పన చేసి జస్టిస్ శ్రీ కృష్ణ తన పేరుకు తగినట్టు ‘కృష్ణలీల’ను ప్రదర్శించారు. ఆంద్రప్రదేశ్ లో ఏర్పడిన సంక్షుభిత పరిస్తితికి పరిష్కారంగా ఆరు ప్రత్యామ్నాయాలు సూచించి మరో సరికొత్త చర్చకు తెర తీసారు.

పది నెలల నిర్విరామ కృషి, ఆరువందల పైచిలుకు పేజీలు, రెండు సంపుటాలు, ఆరు సిఫారసులు – స్తూలంగా ఇదీ శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్. పైగా తాను చేసిన ఆరు సిఫార్సుల్లో మొదటి మూడు ఆచరణ సాధ్యం కావనీ, నాలుగోదానికి సర్వజనామోదం కష్ట సాధ్యం అనీ కమిటీ నివేదికలోనే సన్నాయి నొక్కులు నొక్కారు.

రాష్ట్రాన్ని ఇప్పుడున్న రూపంలోనే కొనసాగించాలని మొదటి సిఫారసులో పేర్కొంటూనే దీనివల్ల తెలంగాణాలో భావోద్వేగాలు పెచ్చరిల్లగలవని, తద్వారా ఏర్పడగల అనిశ్చితిని మావోయిస్టు ఉద్యమం తనకు అనుకూలంగా మార్చుకునే వీలుందని భాష్యం చెప్పి తాను చేసిన తొలి సూచనకు తానే ఇంటూ మార్క్ పెట్టింది.

రెండో సిఫారసు – రాష్ట్రాన్ని రెండుగా విభజించడం – హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం. అయితే ఈ ప్రతిపాదనను తెలంగాణా వాదులు ససేమిరా వొప్పుకోరన్నది కూడా కమిటీ తన అభిప్రాయంగా పేర్కొన్నది.

పోతే, రాయల తెలంగాణా, కోస్తాంధ్ర లుగా రాష్ట్రాన్ని విభజించాలన్నది మూడో సూచన. అయితే దీన్ని రాష్ట్రం లోని ఏ ప్రాంతం వారు అంగీకరించే అవకాశం వుండదని కూడా కమిటీయే చెప్పింది.

హైదరాబాదు నగర పరిధిని బాగా విస్తరించి దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించి, రాష్ట్రాన్ని రెండుగా విభ జించాలనేది నాలుగో ప్రతిపాదన. కానీ, ఉభయ ప్రాంతాలలో ఏఒక్కరికీ ఇది ఆమోద యోగ్యం కాకపోవచ్చని కమిటీ సిఫారసుల సంఖ్యను రెండుకు కుదించే ప్రయత్నం చేసింది.

ఇక అయిదో సిఫారసు రాష్ట్రాన్ని విభజించి తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా చేయడం. ఆంద్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచీ తెలంగాణా ప్రాంతంలో పాతుకుపోయివున్న కొన్ని సహేతుక అసంతృప్తులను పరిగణనలోకి తీసుకుంటే –ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ అసంబద్ధం కాదని ఓ పక్క చెబుతూనే, దీనివల్ల దేశవ్యాప్తంగా కొత్త రాష్ట్రాల ఏర్పాటు ఉద్యమాలకు ఊతం ఇచ్చినట్లయి, అంతర్గత భద్రతపై ప్రతికూల ప్రభావం పడగల ప్రమాదాన్ని ఎత్తిచూపింది. తప్పనిసరి అయితేనే విభజనకు శ్రీకారం చుట్టాలన్నది కూడా ఈ ప్రతిపాదనలోని కొస మెరుపు.

పోతే, క్రమంలో చివరిదేకానీ ప్రాధాన్యతా క్రమంలో చిన్నది కాదన్నట్టుగా ఆఖరి ఆరో ప్రతిపాదన చేస్తూ ఇదే తమ ప్రతిపాదనలు అన్నింటిలో అత్యుత్తమమైనదని కమిటీ తనకు తానుగానే ఒక కితాబును దానికి జత చేసింది. రాష్ట్రాన్నిఇప్పటి మాదిరిగా సమైక్యంగానే వుంచి తెలంగాణా అభివృద్ధికి రాజ్యాంగ బద్ధమయిన చర్యలు తీసుకోవాలన్నది ఆరో ప్రతిపాదన సారాంశం.

రాగల పరిణామాలను గురించి రాయబారం సీనులో అలనాటి శ్రీ కృష్ణుడు కౌరవాదులను హెచ్చరించినట్టు ఇలనాటి కృష్ణుడు – తన కమిటీ చేసిన ఆరు సిఫారసులను అమలు చేయడం వల్ల వొనగూరే ఫలితాలను, పరిణామాలను అంశాలవారీగా నివేదికలోనే తేటతెల్లం చేయడం జరిగింది. ఇంతకీ కృష్ణ కమిటీ ఏమి చెప్పినట్టు, ఏమి తేల్చినట్టు అనే ప్రశ్నలను అందరికీ వొదిలిపెట్టి – ‘సమైక్యమా? విభజనా?’ అన్న అంశం దగ్గరికే సమస్యను తీసుకువచ్చి ‘భూమి గుండ్రం గా వుంది’ అన్న సామెతను నిజం చేసింది.

నివేదికను స్వీకరించిన కేంద్ర హోం మంత్రి చిదంబరం ఆరో తేదీ సమావేశానికి వచ్చిన పార్టీలకు నివేదిక ప్రతులను పంచిపెట్టి, బహిష్కరించిన పార్టీలకు స్పీడ్ పోస్ట్ లో పంపించి, ప్రభుత్వ వెబ్ సైట్ లో సయితం దాన్ని పెట్టి చేతులు కడిగేసుకున్నారు. నివేదికను ఆషామాషీగా కాకుండా క్షుణ్ణంగా చదవండి అని ఒక సలహా కూడా ఇచ్చారు. బాగా అధ్యయనం చేసాక మరోసారి కలుసుకుని మాట్లాడుకుందామని అందర్నీ ఆహ్వానించారు. ఈ మొత్తం ప్రక్రియను గమనించిన వారికి కేంద్ర ఆచి తూచి వ్యవహరిస్తున్నది అన్న భావన కలగడానికి బదులు ఏదో విధంగా వాయిదా మంత్రం పఠించడం మొదలు పెట్టిందన్న అనుమానమే ఎక్కువ కలుగుతోంది.

ఇక రాష్ట్రంలో ఈ అంశంపై తలలు పట్టుకుంటున్న పార్టీలలో మెజారిటీ పార్టీలు, కృష్ణ కమిటీ రిపోర్ట్ రాగానే దానికి కట్టుబడి వుంటామని ఇంతవరకు చెబుతూ వచ్చాయి. కానీ నివేదికలో ఏదో ఒకటి తేల్చకుండా, ఇదమిద్ధంగా ఒకే ఒక సిఫారసు చేయకుండా వెసులుబాటు కల్పించడంతో తిరిగి అందరు పాత పల్లవినే అందుకుంటున్నారు. కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీల్లో రెండు ప్రాంతాలకు చెందినవాళ్ళు – అధిష్టానందే అంతిమ నిర్ణయం అంటూనే తమ మనసులోని మాటలను బయటపెడుతున్నారు. విషయాన్ని ఇంకా నానుస్తూ పోవడం వల్ల ఇరు ప్రాంతాల్లో ఈ రెండు పార్టీలు రాజకీయంగా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని బాహాటంగా ప్రకటిస్తున్నారు.

కాంగ్రెస్, టీడీపీ లు ఎదుర్కుంటున్న ఇరకాట పరిస్తితిని వేర్పాటువాదులు వాటిపై వొత్తిడి పెంచడానికి వుపయోగించుకునే ప్రయత్నం మొదలయింది. ప్రత్యేక తెలంగాణా అన్నది సాకారం కావడానికి ఉద్యమం యెంత వూపు తేగలిగినా అంతిమంగా రాజకీయ నిర్ణయం ద్వారానే అది సాధ్యం అన్న ఎరుక వారికి లేకపోలేదు. అందుకే శ్రీ కృష్ణ కమిటీ నివేదిక సమర్పించిన దరిమిలా ఉత్పన్నమయిన పరిస్తితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి వారు మళ్ళీ నడుం బిగిస్తున్నారనేది తేటతెల్లం. ప్రస్తుత అసందిగ్ధ స్తితికి కాంగ్రెస్, టీడీపీ లను ప్రధాన బాధ్యులుగా చేసి ఆ పార్టీల లోని తెలంగాణా అనుకూలుర చేత వారి అధినాయకత్వంపైనే వొత్తిడి తీసుకు వచ్చేలా చేయడం ఇప్పుడు వారి వ్యూహంగా కానవస్తోంది. అనివార్యం అయితేనే ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన సిఫారసు చేయాలని, అన్ని ప్రాంతాల నడుమ సయోధ్య సాధ్యమయితేనే ఈ నిర్ణయాన్ని ప్రకటించాలని కమిటీ చేసిన సూచనను తెలంగాణావాదులు ఎంతమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ నివేదిక ఈ రూపంలో రావడానికి సీమాంధ్ర వ్యాపార రాజకీయుల హస్తం వుందని వారు ఆరోపిస్తున్నారు. పార్లమెంట్ లో బిల్లు పెట్టడం మినహా తెలంగాణా కోరుకుంటున్నవారిని మరేదీ సంతృప్తి పరచలేదన్నది వారి నిశ్చితాభిప్రాయంగా కానవస్తోంది.

శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్ వల్ల అసలు సమస్య ఏమేరకు పరిష్కారం అవుతుందన్నది అనుమానాస్పదమే. కాకపొతే, అగ్రహారం పోయినా యాక్ట్ మొత్తం తెలిసివచ్చిందన్న సామెత చందాన –రాజకీయ, సామాజిక, ఆర్ధిక రంగాలతో పాటు విద్య, వైద్యం, సేద్యం మొదలయిన అన్ని రంగాలలో ఆంద్ర ప్రదేశ్ ఏర్పడిననాటినుంచి ఇంతవరకు రాష్ట్రం సాధించిన అభివృద్ధి గురించిన వివరాలు ప్రాంతాల వారీగా ఈ నివేదికలో పొందుపరచి సమగ్రమయిన సమాచారాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. పదినెలల కాలంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో పర్యటించి, సమాజంలో విభిన్న వర్గాలవారిని కలుసుకుని సేకరించిన సమాచారం ఆధారంగా రూపొందించిన ఈ నివేదికలోని గణాంకాలు వాస్తవపరిస్తితులకు పూర్తిగా అద్దం పట్టేవిగా వుండక పోవచ్చుకానీ, మొత్తం మీద ఒక స్తూలమయిన అవగాహనకు చదువరులు రావడానికి వీలుగా ఈ నివేదిక ఉపకరించగలదని భావించవచ్చు. వివిధ ప్రాంతాలలో ప్రగతి గురించి, వెనుకబాటుతనం గురించి ప్రస్తుతం వున్న అపోహలు, అనుమానాలు కొంత మేరకయినా తొలగించుకోవడానికి ఈ నివేదిక దోహదం చేస్తుంది.

చివరిగా ఒక మాట. సమస్యకు స్పష్టమయిన పరిష్కార మార్గం చూపకపోయినా, కమిటీ ఒక నిర్దిష్టమయిన సూచన మాత్రం చేసింది. ఇక ఏమాత్రం కాలయాపన చేయకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. తనకు ఇచ్చిన గడువును ఏదో ఒక సాకు చూపి పొడిగించుకోకుండా, ఒక రోజు ముందుగానే నివేదికను సమర్పించి నిబద్ధతను నిరూపించుకున్న శ్రీ కృష్ణ కమిటీ చేసిన ఈ సూచనను సర్కారు పరిగణనలోకి తీసుకోవాలని ఆశిద్దాం.(08—1-2011)

5, జనవరి 2011, బుధవారం

KCR's 'right' move – By Bhandaru Srinivas Rao

KCR's 'right' move – By Bhandaru Srinivas Rao

The reported `move` of Telangana Rashtra Samiti chief K Chandrasekhara Rao not to attend the proposed January 6 meeting convened by the Union Minister P Chidambaram, indeed strategically right and laudable as it no way help solve the ‘T’ problem.

Undoubtedly, the Congress-led UPA government in a `fix` over considering the demand of Telganites for carving out separate statehood, as it scared to open `bottle of worms`. Apart from Telangana, the demand for “Gorkhaland” in West Bengal and other small states elsewhere in UP are pending since quite some time. But, reasons best known to the Congress, it had taken unilateral decision, to support the cause of T-statehood. If it in 2004 elections gave categorical assurance to TRS and contested elections with clear understanding, but later backed out. In 2009 polls, the situation changed a lot though the T-issue became a focal point. The main Opposition Telugu Desam, which thought to gain some political benefits in 2009 polls, forged an alliance with the separatist TRS and formed “Mahakutami” even romping in the one of the left parties – the CPI and discreetly struck a deal with CPM in coastal Andhra and Rayalaseema. That it`s `trick` did not work and people of the state, for the first time preferred `positive vote` and helped Congress retain power with vafer-thin margin.

Though, the `movement` for separate statehood did not take ugly turn during the first stint of Y S Rajasekhara Reddy and later, yet it got momentum, no sooner YSR died in a chopper crash. Even students joined the movement and made the successive Congress chief ministers lives difficult to govern. Added to this was ‘infighting’ with the Congress over settling old scores with the former Chief Minister YSR’s family members.

Coming back to TRS, its movement for separate statehood reached new heights as more and more people joined it. If the student community are up in arms and even refused to write examinations, then the government employees belonging to the region, also responded positively to strengthen the demand for separate statehood by going ahead with their ‘pen down’ strike. Though the Congress, in a bid to buy some time managed to constitute Justice Sri Krishna Committee and ascertain views of all sections of the people, yet its problems in finding a `solution` to the issue becomes all the more difficult with Committee submitting its report on December 30, a day ahead of the deadline set. In fact, the TRS, which threatened not to give its views to Justice Srikrishna Committee, however relented and submitted its view point.

Now it argues, having obtained view point of all the region people, where is the necessity for the Congress to call for yet another round of similar meeting. What seems to have irked TRS most was the Centre’s direction to ask all the invited eight recognized parties, to send two of their representatives. “If this is not `mischievous act`, then what else is?” asks the TRS chief. As a matter of fact, he was right. Now the ball is in Centre’s court and the Congress led UPA government should table a Bill in Parliament to get all parties assent. The major Opposition BJP had already announced its decision to support such a Bill if tabled in Parliament. The TDP too hold similar view onus on the UPA government at the Centre.

One should appreciate that KCR, all through his struggle for separate statehood, had struck to ‘non-violent’ tactics of Mahatma Gandhi, though at times he might have made some provocative statements to whip up regional passions. What most impressed of KCR’s characteristics was his commitment for state bifurcation, nothing less or nothing more. How genuine KCR for T-cause was evident from his declaration that he would wound up party no sooner the Congress-led UPA government begin the process for state bifurcation.

Contrary to this, the Congress and Telugu Desam, appears to have caught in political cog mire and unable to wriggle out. The TDP, which was formed on to protect Telugus self-respect is now in a fix on state bifurcation. His very decision in 2014 elections to ally with TRS cost him dearly in coastal and Rayalaseema regions. The party is yet to overcome from this shock and unable to overcome since then. The Congress which is dodging the issue on one pretext or the other is also equally appears not in favor of smaller states as it would go against the letter and spirit of on which the states were formed on linguistic basis sooner after the independence.

The Congress, which is heading a coalition government at the Centre, is well aware that there are no many takers for such a proposal among its own alliance partners. Any such move bound to coast them dearly, that too on the eve of elections to five state, including West Bengal, where the demand for separate Gorkhaland is loud and clear, besides Tamil Nadu.

In spite of knowing these facts, the TRS is banking on the support of BJP, which openly expressed its support for smaller states. But, can Congress afford to play into the hands of BJP by tabling a Bill in Parliament on T-issue? Certainly, not! Though, the TRS strategies are right and appreciable, yet it’s ambitious to accomplish its set goals, look more difficult in prevailing political scenario. In such a case, will TRS turn the region into a battle ground? If such a thing happen and the law and order further deteriorates, the UPA government at the Centre had its option of revoking Article 356 to clamp President’s rule, if not for long, at least for a short period to come to grips.

Hence, the only option that left before TRS is to pressurize legislators from the Congress and Opposition to resign en masse as promised earlier to create Constitutional crisis. Only with such constructive strike, the TRS can expect to achieve its goal. Or else, however good strategies they may adopt part from the one suggested in these columns, nothing could be achieved. That’s what reality now! (05—1-2011)

3, జనవరి 2011, సోమవారం

అయినను పోయి రావలయు హస్తినకు - భండారు శ్రీనివాసరావు

అయినను పోయి రావలయు హస్తినకు - భండారు శ్రీనివాసరావు


నేడే విడుదల – రేపే ఆఖరి రోజు - ఇవ్వాళే చూడండి - అనే తీరులో రేపేం జరగబోతోంది అనే దానికి ‘గడువు తేదీలు’ మారిపోతున్నాయి.

డిసెంబర్ 31 తరవాత ఏమిటి అనే ప్రశ్న స్తానంలో, జనవరి ఆరో తేదీ తదుపరి ఏమిజరగబోతుందనే మరో ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. గడువుకు ఒకరోజు ముందే శ్రీ కృష్ణ కమిటీ తన నివేదికను కేంద్ర హోం మంత్రికి అందచేసి తన పని పూర్తిచేసుకుంటే, ఆరో తేదీ సమావేశం పేరుతొ కేంద్ర హోం మంత్రి శ్రీ చిదంబరం మరో గడువు పెట్టారు. కొన్నేళ్లుగా రాష్ట్రాన్ని పట్టి కుదుపుతున్న తెలంగాణా అంశంపై సమగ్ర అధ్యనం చేయడానికి కేంద్రం నియమించిన శ్రీ కృష్ణ కమిటీ తనకు ఇచ్చిన గడువులోపలె నివేదిక రూపొందించి కేంద్రానికి అందించింది. తన నివేదిక ఆంద్ర ప్రదేశ్ లోని అన్ని ప్రాంతాలవారికి తృప్తి కలిగించే విధంగా వుంటుందని పేర్కొంటూ ఆ కమిటీ - ఆరు వందల పేజీల నివేదిక సారాన్ని ఒక్క ముక్కలో చెప్పి చేతులు దులుపుకుంది. ముందే రాసిపెట్టుకున్న స్క్రీన్ ప్లే మాదిరిగా నివేదిక చేతిలోకి రాగానే ఒక్క క్షణం కూడా ఆలశ్యం చేయకుండా జనవరి ఆరో తేదీన రాష్ట్రానికి చెందిన ఎనిమిది రాజకీయ పార్టీలను పేరు పేరునా కేంద్ర హోం మంత్రి ఆహ్వానించడం,పార్టీకి ఇద్దరు చొప్పున రావాలని ఆహ్వానాలు పంపడం అంతే వేగంగా జరిగిపోయింది. ఆహ్వానం అందుకున్నప్పుడు ఆహా ఓహో అన్న కొన్ని పార్టీలు పునరాలోచనలో పడి సన్నాయి నొక్కులు ప్రారంభించాయి. ఆరో తేదీకి ముందుగానే హస్తిన వెడుతున్నట్టు ప్రకటించిన కేసీఆర్ ఆ తరువాత ఢిల్లీ సమావేశం తెలంగాణాపై కాలయాపనకు ఉద్దేశించినదిగా భావించి కేంద్రం ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశం వల్ల తెలంగాణాను కోరుతున్న వారికి ఒనగూరేదేమీ లేదన్నది ఆ పార్టీ ఉద్దేశ్యం గా తోస్తోంది. అందుకే కేంద్రం పిలుపుని తిరస్కరించాలని ఇతర పార్టీలకు కూడా ఆ పార్టీ పిలుపు ఇచ్చింది. ఢిల్లీ సమావేశానికి పార్టీకి ఇద్దరిద్దరు చొప్పున పిలవడాన్నికూడా ఈ పార్టీ తప్పుపడుతోంది. చట్టసభలలో మాదిరిగా ఈ అంశంపై వోటింగ్ జరిపి అక్కడికక్కడే మెజారిటీ ప్రకారం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోయినప్పటికీ - టీ ఆర్ ఎస్ ఈ పాయింట్ లేవదీయడం లోని హేతుబద్ధతను కొందరు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణాకు వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్క స్వరం కూడా ఢిల్లీ సమావేశంలో వినబడకూడదన్నది ఆ పార్టీ ఉద్దేశ్యం కాబోలని వారు విశ్లేషిస్తున్నారు.

సరే! డిసెంబర్ 31 వచ్చి వెళ్ళినట్టే జనవరి ఆరో తేదీ కూడా వస్తుంది. పిలుపు అందుకున్న పార్టీలన్నీ కాకపోయినా కొన్ని పార్టీలయినా ఆ భేటీకి తమ ప్రతినిధులను పంపుతాయి. అందరికీ నివేదిక కాపీలు ఇస్తారు. బహుశా నివేదిక సారాంశం ప్రతిని కూడా జతచేస్తారు. వివిధ పక్షాల అభిప్రాయాలు కోరతారు. కాంగ్రెస్, టీడీపీ మినహా సమావేశానికి హాజరయ్యే మిగిలిన పార్టీలది నిర్ణయాత్మక పాత్ర కాదు కనుక వాటికి తమ పార్టీ వైఖరిని మరో సారి పునరుద్ఘాటించడం తప్ప మరో రకమయిన కార్యాచరణకు పూనుకునే ఉద్దేశ్యం వుండక పోవచ్చు. కాంగ్రెస్, టీడీపీలకు ఈ వెసులుబాటు లేదు. అయితే, మామూలుగా కోర్టు తీర్పుల విషయంలో మాదిరిగానే వాటి స్పందన వుండవచ్చు. వ్యతిరేకంగా వస్తే, పూర్తి పాఠం చదివినతరువాతగానీ వ్యాఖ్యానించలేమని చెప్పినట్టు చెప్పేసి అప్పటికి తప్పించుకోవచ్చు. కానీ తెలంగాణా విషయంలో విస్పష్టమయిన వైఖరి వెల్లడించాలని ఆ రెండు పార్టీలకు విపక్షాలనుంచి ఎదురవుతున్న వొత్తిడి మరింత పెరుగుతుంది. తెలంగాణా ప్రాంతానికి చెందిన తమ పార్టీ వారినుంచి వొత్తిళ్ళు వున్నప్పటికీ సాధారణ ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ వ్యవధానం వున్నందువల్లా, మధ్యంతరం వంటి కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం తమ చేతులోనే వున్నందువల్లా కాంగ్రెస్ పార్టీకి ఈ విషయంలో తెలుగు దేశం పార్టీ కంటే కొంత తీరుబాటుగా వ్యవహరించే వీలుంది. కానీ శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్ ఏవిధంగా వచ్చినా ఇరకాటాన పడేది మాత్రం టీడీపీనే. ఏది ఎలావున్నా, కొంచెం హెచ్చుతగ్గులుగా ఈ రెండు పార్టీల్లోనే ఆరో తేదీ గురించిన ఆందోళనలు మొదలయ్యాయన్నది కానవస్తూనేవుంది. తెలంగాణాకు చెందిన కాంగ్రెస్ ఎంపీల సమావేశాలు, నాగం వంటి టీడీపీ అధినాయకుల ప్రకటనలు ఈ వాస్తవానికి అద్దం పడుతున్నాయి. తెలంగాణాకు చెందిన ఈ రెండు పార్టీల నాయకులు, పైకి గాంభీర్యం ప్రదర్శిస్తూ వున్నప్పటికీ, అనుచరగణం నుంచి వస్తున్న వొత్తిళ్ళు వారిని తీవ్రమయిన వొత్తిడికి గురి చేస్తున్నాయని ఆంతరంగిక సమావేశాల్లో బాహాటంగా వొప్పుకుంటున్నారు. తెలంగాణా కాంగ్రెస్ నాయకులది ఒక విచిత్రమయిన పరిస్తితి. అధిష్టానం మనసులో ఏముందో వారికి తెలియదు. ఢిల్లీ పెద్దల వ్యూహాలు ఏమిటో తెలియదు. కార్యకర్తలనుంచి వొస్తున్న వొత్తిళ్ల గురించి పై వారికి చెప్పుకోలేరు. వారికి తెలిసినదల్లా ‘అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి వుంటాం, శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్ కి కట్టుబడి వుంటాం’ అని అప్పుడప్పుడు మొక్కుబడి ప్రకటనలు చేయడం. కాకపొతే, కేకే వంటి సీనియర్ నాయకులు ‘తెలంగాణా ఇవ్వకపోతే సీ డబ్ల్యు సీ పదవిని మూలకు విసిరి పారేస్తాన’ని బహిరంగ వేదికలపై ప్రకటించడం కేడర్ ను ఏమాత్రం సంతృప్తి పరుస్తుందో వేచి చూడాలి. ఇలాటి వ్యాఖ్యలను అధిష్టానంపై తిరుగుబాటుగా పరిగణిస్తారా లేక తెలంగాణా అంశం తమ చేజారి పోకుండా - ఇదంతా పైనుంచి ఢిల్లీ పెద్దలు ఆడిస్తున్న నాటకంలో ఒక భాగమా అని అనుమానిస్తున్నవారు కూడా లేకపోలేదు.

ఇక టీడీపీ – ఈ పార్టీ పని అయిపొయింది, నాయకత్వం మార్పుకోసం పార్టీలోనే చర్చలు సాగుతున్నాయి అనే వదంతుల నడుమ – ఈ ఆరో తేదీ ఆ పార్టీ నెత్తి మీద కత్తిలా వేలాడుతోంది. రైతుల సమస్యమీద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎనిమిది రోజుల నిరాహారదీక్ష చేసి జాతీయ స్తాయిలో కూడగట్టుకున్న ప్రతిపక్ష పార్టీల సంఘీభావం రాజకీయ ఫలితాలు ఇవ్వకముందే శ్రీ కృష్ణ కమిటీ నివేదిక రూపంలో అగ్ని పరీక్షను ఎదుర్కోవాల్సిన పరిస్తితి ఏర్పడింది. తెలంగాణా ప్రాంతానికి చెందిన కొందరు నాయకుల నుంచి వినవస్తున్న ధిక్కార స్వరాలు - ఆరో తేదీకి ముందు ఆ పార్టీకి ఆందోళనకరంగా మారాయి.

అలాగని టీ ఆర్ ఎస్ కు ఆరో తేదీ ఆందోళన లేదని కాదు. కమిటీ రిపోర్ట్ అన్ని ప్రాంతాలకు ఆమోదయోగ్యంగా వుంటుందని వెలువడుతున్న కధనాలు, కేంద్ర బలగాల మోహరింపు, రాష్ట్ర సమగ్రాభివృద్ధి గురించి కీలక స్తానాల్లో వున్నవారు చేస్తున్న ప్రస్తావనలు సహజంగానే టీ ఆర్ ఎస్ కు ఇబ్బంది కలిగించేవే. కాకపొతే, ఇన్నేళ్ళుగా తాము సాగిస్తూ వచ్చిన వేర్పాటు ఉద్యమానికి వ్యూహాత్మక ముగింపు లభించబోయే తరుణంలో ఆ పార్టీ కూడా వ్యూహాత్మకంగానే కొంత సంయమనం పాటిస్తున్నదనుకోవాలి. కానీ నివేదిక తమ ఆశలపై నీళ్ళు చల్లే పక్షంలో ఏమి చేయాలన్న విషయంలో ఆ పార్టీ నేతలు లోలోపల మల్లగుల్లాలు పడుతున్నారు. మధ్యంతరం వస్తే ఇటు తెలంగాణాలో తాము, అటు ఆంధ్రాలో జగన్ పెట్టబోయే పార్టీ ఘన విజయాలు సాధించడం తధ్యమనీ, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో నూకలు చెల్లిపోతాయనీ చేస్తున్న ప్రకటనలకు కారణం ఇదే అని భావిస్తున్నవారు వున్నారు. మధ్యంతరం రాని పక్షంలో మరి కొన్నేళ్లపాటు ఉద్యమ స్పూర్తి అణగారిపోకుండా, ఇన్ని సంవత్సరాలుగా సాగిస్తూ వచ్చిన శాంతియుత పోరాటం అదుపు తప్పకుండా చూసుకోవడం అలవికి మించిన భారమే.

పోతే, శ్రీ కృష్ణ కమిటీ నివేదిక రాష్ట్ర విభజనకు పచ్చ జండా వూపగలదేమోనన్న సందేహాలు, ఏదో ఒక మేరకు వారి మనసుల్లో సమసిపోయాయేమోగానీ ఆంద్ర ప్రాంత నేతలనుంచి – ఏ పార్టీ వారయినా కానీ – ఆరోతేదీ గురించిన ఆందోళనలు అంతగా వ్యక్తం కావడం లేదనే చెప్పాలి.

ఏదిఏమయినా రాష్ట్రాన్ని గత కొన్నేళ్లుగా వేధిస్తున్న ఒక సమస్యకు పరిష్కారం కనుగొనే దిశగా జరుగుతున్న ప్రయత్నంలో శ్రీ కృష్ణ కమిటీ నివేదిక సమర్పించడం అనే మరో అంకం ముగిసింది. బంతిని తన చేతిలో పెట్టుకుని కేంద్రం, సమస్యతో సంబంధం వున్న రాష్ట్ర రాజకీయ పక్షాలను ఢిల్లీ సమావేశానికి ఆహ్వానించింది. సమావేశానికి హాజరయ్యేవారు కూడా అప్పటికప్పుడు నిర్ణయం ప్రకటించగలిగిన స్తితిలో లేనప్పుడు ఆరో తేదీన ఏదో తుది పరిష్కారం లభించగలదని అనుకోవడం అత్యాశే అవుతుంది. కాకపొతే రాజకీయ చదరంగంలో కాకలు తీరిన రాజకీయ పక్షాలన్నీ తమ నైపుణ్యాన్ని మరో మారు ప్రదర్శించడానికి ఈ సమావేశం ఒక వేదికలా ఉపయోగపడుతుంది.

‘ఆరో తేదీ మీటింగ్ లో ఏమీ జరగదు, ఎలాటి తుది నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదు’ అని తెలిసి కూడా వెడుతున్నాయంటే అవి సమస్యను దాటవేయాలని చూస్తున్నాయని చెప్పడం సబబు కాదు కానీ, ఏదో ఒక విధంగా కొంత సమయం చేజిక్కించుకుని, ప్రత్యర్ధులపై పై ఎత్తులకు పాచికలు సిద్ధం చేసుకోబోతున్నాయని భావించడానికి మాత్రం వీలుంది.

ఇక- ఆరో తేదీ తరవాత ఏదయినా జరగొచ్చు. ఏమీ జరగకపోవచ్చు. రాజకీయ క్రీడలతో సంబంధం లేని వాళ్లందరూ రెండోదే జరగాలని మనసారా కోరుకుంటారు. (03-01-2011)